“ఫామ్‌హౌస్‌”పై సీబీఐ కేసు ఇక్కడ కాదు ఢిల్లీలోనే !

ఫామ్ హౌస్ కేసులో సీబీఐ అధికారులు కేసును ఢిల్లీలోనే నమోదు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేయాలంటే .. ఆయా రాష్ట్రాల్లోనే నమోదు చేస్తారు. కానీ ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సీబీఐ ఢిల్లీలో కేసు నమోదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం తెలంగాణలో సీబీఐకి ప్రభుత్వం జనరల్ కన్సెంట్ రద్దు చేయడమే.

అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సీబీఐ విచారణ జరిపితే జనరల్ కన్సెంట్ ఉన్నా లేకపోయినా ఒక్కటే. కానీ ప్రాథమికంగా అనుమతి మాత్రం ప్రభుత్వం ఇవ్వాలి. కానీ అప్పీల్ చేసుకున్నందున ఆ తీర్పు వచ్చే వరకూ అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదు. సీబీఐ లేఖ రాసినా ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఢిల్లీలో కేసు నమోదు చేయాలని ఆలోచిస్తున్నారు. ఢిల్లీలో కేసు నమోదు చేసినా హైదరాబాద్ కేంద్రంగా విచారణ చేయనున్నారు.

ఈ కేసును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే విచారణ ప్రారంభమైతే.. చాలా సీరియస్ గా సాగుతుందని అంటున్నారు. హైదరాబాద్ సీబీఐ అధికారులు కాకుండా ఢిల్లీ స్థాయి సీబీఐ అధికారులు విచారణ జరుపుతారని అంటున్నారు. ప్రస్తుతం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. అక్కడ తీర్పు వచ్చిన తర్వాత సీబీఐ దూకుడు చూపించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close