బాల‌య్య‌, చిరుల కోస‌మే వెన‌కడుగు వేశాం: దిల్ రాజు

11న రావాల్సిన‌ వార‌సుడు వెన‌క్కి వెళ్లింది. ఈ సినిమాని 14న విడుద‌ల చేస్తున్న‌ట్టు దిల్ రాజు ప్ర‌క‌టించారు. ఏపీ, తెలంగాణ‌ల‌లో… చిరంజీవి, బాల‌కృష్ఱ చిత్రాల‌కు ఎక్కువ థియేట‌ర్లు క‌ల్పించాల‌న్న ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు చెప్పుకొచ్చారు దిల్ రాజు. అయితే త‌మిళంలో మాత్రం ఈనెల 11నే వార‌సుడు వ‌స్తోంది. రెండు రోజులు ఆల‌స్యంగా తెలుగులో విడుద‌ల అయినంత మాత్రాన‌.. త‌న సినిమాకొచ్చే న‌ష్టం ఏమీ లేద‌ని, సినిమాపై న‌మ్మ‌కంతోనే… ఆల‌స్య‌మైనా చూస్తార‌న్న ధీమాతోనే వాయిదా వేశామ‌ని క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. రిలీజ్ డేట్ మార్పు విష‌యంలో ఇండ‌స్ట్రీలోని పెద్ద‌లంద‌రితోనూ చ‌ర్చించాన‌ని, వాళ్లు త‌న నిర్ణ‌యాన్ని హ‌ర్షించార‌ని చెప్పుకొచ్చారు.

ఈనెల 12న వీర సింహారెడ్డి, 13న‌.. వాల్తేరు వీర‌య్య విడుద‌ల అవుతున్నాయి. వీటి మ‌ధ్య వార‌సుడు వ‌స్తోంది. రెండు తెలుగు సినిమాలు ఉండ‌గా, ఓ డ‌బ్బింగ్ సినిమాకి థియేట‌ర్లు ఎందుకు ఇవ్వాలి? అంటూ మిగిలిన నిర్మాత‌లూ, డిస్టిబ్యూట‌ర్లూ దిల్ రాజుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో.. జ‌న‌వ‌రి 11న త‌న సినిమాని విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు దిల్ రాజు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ విడుద‌ల తేదీలో మార్పు వ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close