సంక్రాంతి పందేలు అయ్యే వరకూ ఏపీలోని చీకోటి ప్రవీణ్ మకాం !

కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఏపీలో మకాం వేశారు. ఆయనకు సంక్రాంతి సీజన్ అంటే.. కోట్ల రూపాయల బిజినెస్ జరిగే సీజన్. గత ఏడాది ఏం జరిగిందో కళ్ల ముందే చూశారు. గత ఏడాది చీకోటి ప్రవీణ్ ఏవరో తెలియదు. కానీ ఈడీ కేసుల్లో విచారణ తర్వాత ఆయన వ్యవహారం హాట్ టాపిక్ అయింది. గుడివాడలోనూ ఆయనే కేసినో నిర్వహించారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ మరోసారి రంగంలోకి దిగారు. సంక్రాంతి పండుగ అయిపోయే వరకూ ఏపీలోనే మకాం వేస్తున్నట్లుగా ప్రకటించారు. మిత్రుల సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటానని ఆయన చెబుతున్నారు.

విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుని మీడియాతో మాట్లాడుతూ.. కేసినో ఎవరెవరో ఆడారో అందరి పేర్లు త్వరలోనే బయట పెడతానని ఓ హెచ్చరిక లాంటి స్టేట్ మెంట్ ఇచ్చారు. పండుగ అయిపోయే వరకూ ఏపీలో ఉంటాననే చెప్పుకొచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో కేసినో ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సారి మరింత విస్తృతంగా ఈ జూద క్రీడలు ఉంటాయని అంటున్నారు. ఇలా ప్రచారం జరుగుతున్న సమయంలోనే.. చీకోటి ప్రవీణ్.. సంక్రాంతి వేడుకల పేరుతో ఏపీలోనే మకాం వేయడం కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

సంక్రాంతి అంటే గతంలో కోడి పందెలు మాత్రమే. కానీ ఇప్పుడు మాత్రం అన్ని రకాల జూదాలు తయారయ్యాయి. అధికార పార్టీ నేతలు సొమ్ము చేసుకోవడానికి కేసినోలనూ రంగంలోకి దించుతున్నారు. వ్యసనపరులు ఇల్లు గుల్ల చేసుకుని జూదం ఆడితే.. రాజకీయ నేతలు.. కేసినోలు పెట్టి.. కోట్లు వెనకేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హార్డ్ డిస్క్ పోయిందా.. ఇదేం విచిత్రం!

సినిమా రిజల్ట్ ఎవ‌రి చేతుల్లోనూ ఉండ‌దు. ఎంత క‌ష్ట‌ప‌డినా ప్రేక్ష‌కుల తీర్పు ఫైన‌ల్‌. కంటెంట్ చేతిలో లేక‌పోయినా, ఫుటేజ్ అయినా చేతుల్లోనే ఉంటుంది క‌దా. దాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిన బాధ్య‌త నిర్మాణ సంస్థ‌కు...

బూతుల‌కు మ్యూట్‌.. ఇప్పుడంతా క్లియ‌ర్‌!

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' ట్రైల‌ర్ చూసి అంతా షాక్ తిన్నారు. ఇంటిన్సిటీ మాట ప‌క్క‌న పెడితే, అందులో కొన్ని బూతులు య‌దేచ్ఛ‌గా వ‌దిలేశారు. ట్రైల‌ర్‌లోనే ఇన్ని ఉంటే, ఇక సినిమాలో ఉన్ని ఉంటాయో...

వారి ఓట్లు ప‌డ‌లే… వైసీపీకి సీన్ అర్థ‌మ‌య్యింది!

ఏపీలో రిజ‌ల్ట్ డే ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ టెన్ష‌న్ పెరిగిపోతుంది. కూట‌మికి వైసీపీకి మ‌ధ్య నువ్వా-నేనా అన్న‌ట్లు సాగిన పోరులో గెలుపెవ‌రిదో తేలిపోనుంది. అయితే, ఏ విష‌యంలోనూ అల‌స‌త్వం లేకుండా ఇరు వ‌ర్గాలు...

గులాబీకి గుచ్చుకుంటున్న ఆర్ఎస్పీ ముళ్ళు..!!

కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై బీఆర్ఎస్ నేతల విమర్శలు వ్యూహమో, మరేమిటో కాని నేతల మధ్య సమన్వయం కొరవడినట్లు కనిపిస్తోంది. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... ఈ ఇద్దరు నేతలు ఒకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close