నిధులు, విధుల్లేని ఆ కార్పొరేషన్లకు పొడిగింపు జీవో !

ఏపీలో నిధులు, విధులు ఉండని 55 బీసీ కార్పొరేషన్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నియమించిన 55 బీసీ కార్పోరేషన్ల పదవీకాలం 2022 డిసెంబర్ 16తో ముగిసింది. ఇప్పటి వరకూ వేచి చూసి ఇప్పుడు వాటిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 55 కార్పొరేషన్లలోని ప్రతీ కార్పొరేషన్ కు ప్రత్యేకంగా ఒక్కో జీవోను విడుదల చేసింది. ఈ జీవోలో కార్పొరేషన్ ఏర్పాటు, పదవీకాలంతో పాటు ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలం పెంపును తెలియజేసింది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెనుకబడిన వర్గాల కార్పొరేషన్లకు రూపాయి సాయం చేయడం లేదు. అమ్మఒడి లాంటి పథకాల డబ్బులను కార్పొరేషన్ల ఖాతాలో చూపిస్తున్నారు. తర్వాత బీసీలకు యాభై ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అన్నింటికీ పాలకవర్గాలను నియమించారు. రెండేళ్ల పదవీ కాలం ఆ పాలకవర్గాలకు ముగిసింది. ఈ రెండేళ్లలో వారికి ఆఫీసు కూడా ఏర్పాటు కాలేదు. రూపాయి నిధులు రాలేదు. ఇటీవల వీరందర్నీ పిలిచి.. భారీగా పదవులు ఇచ్చామని బీసీ సదస్సు కూడా నిర్వహించారు. కానీ ఆ తర్వాతి రోజే పదవీకాలం పూర్తయింది. ఇప్పుడు ఎదురు చూసేలా చేసి.. వాటికి పొడిగింపు ఇచ్చారు.

అన్ని కులాలను.. వారి కార్పొరేషన్లను పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పథకాలకు ఇచ్చే నిధులు ఆ కార్పొరేషన్ల పేరుతో చూపించడం తప్ప.. ఆయా వర్గాల్లోని యువత ఆర్థికంగా ఎదిగేలా సహకరించేందుకు మాత్రం పెద్దగా ముందుకు రాలేదు. ఎవరికీ రుణాలివ్వలేదు. కానీ రాజకీయంగా తమ పార్టీ నేతలకు పదవులు కేటాయించుకోవడానికి.. ప్రచారానికి ఉపయోగపడుతూండటంతో.. కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close