రూ. 495 కోట్లు ఇవ్వట్లేదని ఏపీపై తెలంగాణ కంప్లైంట్ !

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉంటాయి… దానిపై వారు కేంద్రాన్ని సంప్రదిస్తూనే ఉంటారు. ఆ సంప్రదిపులు లేఖల దగ్గరే ఉంటాయి కానీ సమస్యలు పరిష్కరం కావు. తాజాగా అలాంటి సమస్య ఒకటి తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన సెంటర్లీ స్పాన్సర్డ్‌ స్కీం నిధులు రూ.495 కోట్లు తిరిగి ఇప్పించాలని మంత్రి హరీశ్‌ రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రేశారు. 2014-15లో సీఎస్‌ఎస్‌ కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నగదును పొరపాటున ఆంధ్రప్రదేశ్‌లో ఖాతాలో జమచేశారని, వాటిని తిరిగి తెలంగాణకు ఇప్పించాలని ఆయనంటున్నారు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో (2014-15) కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారు. అయినప్పటికీ మొత్తం సీఎస్ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని గుర్తుచేశారు. దీంతో తెలంగాణ నష్ట పోయిందని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము ఇప్పటికే కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లామని .. ఎనిమిదేళ్లు గడుస్తున్నా రూ.495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేసేలా కృషి చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు.

అచ్చం అలాంటిదే కరెంట్ బకాయిల వివాదంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాస్తోంది. తమకు ఆరున్నర వేల కోట్లు రావాలని కానీ తెలంగాణ ఇవ్వడం లేదని అంటోంది. కేంద్రం ఏపీకి ఇవ్వాలని తెలంగాణను ఆదేశిచింది. కానీ తెలంగాణ కోర్టుకెళ్లింది. ఆ వివాదం ఎటూతేలలేదు. ఇప్పుడు అలాగే ఉన్న మరో ఫిర్యాదుతో తెలంగాణ ముందుకు వచ్చింది. నిజానికి ఇలాంటి సమస్యలు .. బేసిన్లు..భేషజాలు లేవని ఒకే వేదికపై నుంచి ప్రకటించుకున్న జగన్, కేసీఆర్ చర్చించుకుంటే పరిష్కారమవుతాయి.. కానీ వీరు అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఇలా లేఖలతో సరి పెట్టుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close