అవినాష్ రెడ్డికి 28న డేట్ ఇచ్చిన సీబీఐ !

ఈ రోజు నోటీసు ఇచ్చి రేపు రమ్మంటే వెళతామా.. ఐదు రోజుల తర్వాత అయితే ఆలోచిస్తా అన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి …సీబీఐ ఖచ్చితంగా ఐదు రోజుల తర్వాత డేట్ ఇచ్చింది. 28వ తేదీన హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీసుకు రావాలని సూచించింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన ఎంపీ.. జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వాలన్న కారణం చూపి ఆయన డుమ్మా కొట్టాడనికి కూడా చాన్స్ లేదు.

ఐదు రోజుల తర్వాత సీబీఐ నోటీసులు ఇస్తే ఇదే కారణం చెప్పి ఆయన తప్పించుకోవచ్చని అనుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే సీబీఐ అలాంటి చాన్స్ ఇవ్వలేదు. పార్లమెంట్ సమావేశాల కంటే ముందే తేదీ ఖరారు చేసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఖచ్చితంగా సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. హాజరు అయితే అరెస్ట్ చేస్తారేమోనన్న ఆందోళన ఆయనతో ఉందని చెబుతున్నారు. అందుకే న్యాయనిపుణలుతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

కేసు విచారణ హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఇక అన్నీ హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతాయి. నిందితుల్ని కూడా హైదరాబాద్ జైలుకు తరలించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ కేసు కీలక పరిణామాలకు వేదికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇరవై ఎనిమిదో తేదీ తర్వాత… అలాగే గంగిరెడ్డి బెయిల్ పై హైకోర్టు నిర్ణయం తర్వాత రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట దక్కేనా..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించడంతో...

ఓటేస్తున్నారా ? : కోర్టు ధిక్కరణల పాలన గుర్తుకు తెచ్చుకోండి!

రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఆ ప్రభుత్వం ఎందుకు ?. గతంలో ఒక్క కేసులో కోర్టు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం రాజీనామా...

రాజేష్ మహాసేనను సస్పెండ్ చేసిన టీడీపీ

రాజేష్ మహాసేనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. గన్నవరంలో జనసేన అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అప్రమత్తమైన టీడీపీ హైకమాండ్ రాజేష్ ను పార్టీ...

ఓటర్ల జాబితాలో డబ్బుల జమకు హైకోర్టు పర్మిషన్

అనేక రకాల కుట్రల విషయంలో వైసీపీ పెద్దల ప్లానింగ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. చేయాలనుకున్నది చేసేయడానికి నాలుగు మార్గాలను ఎంచుకుంటారు. అందులో ఒక దాని ద్వారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close