అవినాష్ రెడ్డిని 4 గంటలు ప్రశ్నించి వదిలి పెట్టిన సీబీఐ !

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగుగంటలకుపైగా ప్రశ్నించి పంపేసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో హాజరయ్యారు. ఏడున్నర వరకూ సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్‌ను తొలి సారి నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. సీబీఐకి పూర్తిగా సహకరిస్తున్నానని.. కొంత మంది సీబీఐని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మళ్లీ అవసరమైతే పిలుస్తామని చెప్పారని అవినాష్ రెడ్డి తెలిపారు. వివేకా హత్య కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి వివరాలు చెప్పానన్నారు.

సీబీఐ విచారణ ఏ కోణంలో జరిగిందన్నదానిపై స్పష్టత లేదు. అయితే వివేకా హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం చేయడం.. దారుణ హత్య జరిగినా గుండె పోటు అని సమాచారం అందరికీ ఇవ్వడం గురించి ప్రధానంగా ప్రశ్నించారని చెబుతున్నారు. అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీసులోకి వెళ్లినప్పటి నుండి ఆయన అనుచరులు బయట ఉత్కంఠగా గడిపారు. అయితే ఏడున్నర సమయంలో ఆయన బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. విచారణ సమయంలో సీబీఐ ఆఫీసుకు అవినాష్ రెడ్డితో పాటు శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు వంటి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు.

అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చే ముందే.. లాయర్ ను అనుమతించాలని.. విచారణను రికార్డు చేయాలని లేఖ రాశారు. అయితే ఈ విజ్ఞప్తులను సీబీఐ పట్టించుకోలేదు. లాయర్ ను కూడా లోపలికి అనుమతించలేదు. అంతకు ముందు సీబీఐ విచారణకు వెళ్లే ముందు.. లోటస్ పాండ్‌కు వెళ్లారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి తో సమావేశం అయ్యారు. ఏ అంశాలపై చర్చించారన్నది స్పష్టత లేదు. అయితే ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close