హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దేశంపై దాడేనంటున్న అదానీ !

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ చాలా ఆలస్యంగా అయినా ఎదురుదాడి ప్రారంభించింది. తాము వెల్లడించిన విషయాలు తప్పు అయితే తమపై దావా వేయాలని సవాల్ చేస్తున్నా… మూడు, నాలుగు రోజులుగా పైపై వివరణలకే సర్దుకుపోయిన అదానీ గ్రూప్ తాజాగా ఆరు పేజీల వివరణతో ఎదురుదాడి చేసింది. ఇందులో అంతిమంగా చెప్పొచ్చిందేమిటంటే… హిండెన్ బెర్గ్ రిపోర్ట్ దేశంపై దాడి అని చెప్పడమే.

దేశంలో ఓ పద్దతి ప్రకారం.. లెక్క చూసుకుని మరీ దాడి చేస్తున్నారని అదానీ సంస్థ చెబుతోంది. ఇండియా వ్యవస్థల్ని తక్కువ చేయడంతో పాటు భారత్ వృద్ధిని తగ్గించడం లక్ష్యంగా ఈ దాడి జరుగుతోందని విశ్లేషించింది. ఇప్పటి వరకూ దేశంలో ఏం జరిగినా … దేశం కోసం … ధర్మం కోసం అని బీజేపీ జాతీయవాదాన్ని అడ్డు పెట్టుకునేది . ఇప్పుడు ఈ వ్యూహం అదానీ కూడా అందుకుంది. తమపై వస్తున్న ఆరోపణలను దేశంపై దాడిగా చిత్రీకరిస్తోంది.

గతంలో అమెరికాలో కూడా ఎన్నో కంపెనీలు తప్పుడు విధానాలకు పాల్పడి మూతపడ్డాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ కూడా అలాంటికంపెనీల జాబితాలను వెల్లడించింది. అప్పుడెవరూ ఆ సంస్థ అమెరికాపై దాడి చేసిందని ఎవరూ అనలేదు. కానీ ఇండియాలో ఉన్న అడ్వాంటేజ్ ని అదానీ పక్కాగా ఉపయోగించుకంటున్నారు. అదానీ వ్యాపార సంస్థల లావాదేవీల గురించి ఇండియాలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. అది గాలి బుడగ అని ఎప్పుడైనా పేలిపోవచ్చన్న అంచనాలున్నాయి.

కానీ రాజకీయ పరిస్థితులే అదానీ సంస్థల్ని నిలబడుతున్నాయని కార్పొరేట్ వర్గాలు కూడా అంచనా వేస్తాయి. ఇప్పుడు తన సంస్థలు.. లోపాలు.. మోసాలను .. అదానీ మరింత పకడ్బందీ చట్రంలో దాచేసుకుంటున్నారు. అదే జాతీయ వాదం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close