ఏపీ సచివాలయ ఉద్యోగులకే అగ్నిపరీక్షలు – ఫెయిలయితే ?

ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని వర్గ శత్రువులుగా భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏ విభాగ ఉద్యోగికి లేనన్ని ఆంక్షలు పెడుతోంది. నిబంధనలు అమలు చేస్తోంది. సచివాలయ ఉద్యోగాలన్నీ కార్యాలయంలో కూర్చుని చేసేవి కావని తెలిసినా ఇప్పటికే ఫేస్ అటెండెన్స్ అని అదనీ..ఇదనీ ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు.. ప్రజల్ని మెప్పించేలా పని చేయాలని… వారు రాకపోయినా అవసరం లేకపోయినా సేవలు చేయాల్సిందేనని ఒత్తిడి చేస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా పనితీరు మదింపు చేపట్టింది.

ఏ ఉద్యోగి ఏ సేవ చేశాడు.. ఏ పని చేశాడు అనే లెక్కలు తీస్తోంది. ఇందు కోసం ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసింది. చాలా సచివాయాలకు జనం రావడం లేదు. ఎలాంటి సేవలు అందించడం లేదు. వచ్చే కొద్ది మందికి సేవలు అందిస్తున్నారు. ఎవరినీ వెనక్కి పంపడం లేదు. అయితే అక్కడ ఉన్న ఉద్యోగులకు.. చేస్తున్న సేవలకు పొంతన లేదని… రోజుకు ఇంత మందికి సేవ చేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. రేపు ఎలా పని చేస్తున్నారన్నదాన్ని ఇదే ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఏదో ఓ చర్యతీసుకోవడానికి ఇలాంటివి అవకాశంగా వాడుకుంటారని .. సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే ఉద్యోగులు సరిగా ఆఫీసుకొస్తున్నారా? ఆఫీసు వేళల్లో బయటకు వెళ్తున్నారా? ఇంకేదైనా కార్యక్రమాల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారా? అనే విషయాలను తనిఖీ చేసేందుకు ఒక్కో రెవెన్యూ డివిజన్‌కు ఒక్కో స్పెషల్‌ స్క్వాడ్‌ పెట్టారు. ఉద్యోగులను పూర్తిస్థాయిలో తమ అదుపులో పెట్టుకోవడంతోపాటు వారిని ఆత్మరక్షణలోకి నెట్టేందుకు ఇలా చేస్తోందని.. భయ పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని వేల మందికి ప్రొబేషన్ రావాల్సి ఉంది. ఆ ఊసు ప్రభుత్వం ఎత్తడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close