‘ఖుషి’…. మ‌ళ్లీ మొద‌లు

స‌మంత అనారోగ్యంతో… `ఖుషి` సినిమాకి బ్రేకులు ప‌డిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ఇది. డిసెంబ‌రులో విడుదల కావాల్సింది. అయితే.. స‌మంత అనారోగ్యంతో షూటింగ్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. 50 శాతం షూటింగ్ మాత్ర‌మే అయ్యింది. స‌మంత మ‌ళ్లీ సెట్స్‌పైకి ఎప్పుడొస్తుందో తెలియ‌ని సందిగ్థంలో.. `ఖుషి` సినిమా ఊగిస‌లాడింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ వ‌చ్చేసింది. ఖుషి షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంద‌ని ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ప్ర‌క‌టించాడు. ఫిబ్ర‌వ‌రిలో స‌మంత డేట్లు ఇచ్చింద‌ట‌. విజ‌య్ కూడా సెట్లోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. ఫిబ్ర‌వ‌రిలో చ‌క చ‌క షూటింగ్ ముగించాల‌ని చిత్ర‌బృందం ప్ర‌య‌త్నిస్తోంది. స‌మంత ఈ సినిమా కోసం మ‌రో 25 రోజులు కేటాయించాల్సివుంది. ఫిబ్ర‌వ‌రి మొత్తం ఈ సినిమాకే ఇచ్చేస్తే స‌రి. లేదంటే మార్చిలో మ‌రో షెడ్యూల్ ఉంటుంది. అన్నీ అనుకొన్న‌ట్టు జ‌రిగితే ఈ వేస‌విలో `ఖుషి` చూడొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close