బడ్జెట్ ఒక్కటే తెలంగాణ అసెంబ్లీ ఎజెండా !

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ అంత ఆసక్తిగా లేనట్లుగా కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాలను సాధారణంగా మూడు, నాలుగు వారాల పాటు నిర్వహిస్తారు. కానీ కేసీఆర్ మాత్రం నాలుగైదు రోజుల్లోనే పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మామూలుగా అయితే గవర్నర్ ప్రసంగం లేకుండానే తొలి రోజే బడ్జెట్ పెట్టి.. తర్వాత రెండు రోజుల్లో పూర్తి చేయాలనుకున్నారు. కానీ గవర్నర్ ప్రసంగం తప్పని సరి అవడంతో బడ్జెట్ ను ఆరో తేదీకి మార్చుకున్నారు. తొలి రెండు రోజులు గవర్నర్ ప్రసంగం.. ఆ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంతో ముగిసిపోయింది.

ఆరో తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. . ఈనెల 7న అసెంబ్లీకి సెలవు కాగా.. 8 నుంచి 12 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. 8న బడ్జెట్ పై సాధారణ చర్చ జరగుతుంది. 9,10,11 తేదీల్లో శాఖల వారీగా పద్దులపై శాసనసభలో చర్చ జరగనుంది. ఈ నెల 12 ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించిన తర్వాత నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే విపక్షాలు మాత్రం కనీసం ఇరవై రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. అన్ని సమస్యలపై చర్చించాలంటున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం ఆ మూడ్‌లో లేరని బీఆర్ఎస్ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.

మార్చి వరకూ డెడ్ లైన్ పెట్టుకుని అన్ని రకాల పనుల్ని పూర్తి చేస్తున్నారు. పదిహేడో తేదీన తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం ఉంది. ఆ తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీనిరద్దు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. బడ్దెట్ ను కూడా ఆమోదించినందున ఇక ఏ సమస్యా ఉండదని.. అంటున్నారు. సాధారణంగా బడ్జెట్‌ను మార్చిలో ప్రవేశ పెడతారు. ఈ సారి ముందుగానే ప్రవేశ పెట్టడానికి.. ముందస్తు ఆలోచనలే కారణమంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close