ఏపీ రాజ్‌భవన్‌లో “ఉద్యోగాల పర్మినెంట్” కహానీ !

ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆయనను చత్తీస్ ఘడ్ పంపారు. ఇప్పుడు రాజ్ భవన్‌లో కొన్ని వివాదాలు బయటకు వస్తున్నాయి. రాజ్ భవన్ లో ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేస్తున్న వంద మందికిపైగా ఉద్యోగులను పర్మినెంట్ చేయిస్తామని కొంత మంది గూడుపుఠాణి నడిపినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం తేలక ముందే గవర్నర్ బదిలీపై వెళ్తూండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.

రాజ్ భవన్ లో మొత్తం వివిధ కేటగిరీల్లో 140 మంది ఔట్ సోర్సింగ్లో పని చేస్తున్నారు. వీరు ఎవరూ కనీసం కాంట్రాక్ట్ సిబ్బంది కూడా కాదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. వారిలో వంద మందిని పర్మినెంట్ చేయించేందుకు కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్ భవన్ కు వంద మంది పర్మినెంట్ సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఆ వంద మందిని ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పర్మినెంట్ చేయించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అధికారులు మాత్రం ఇలా చేయడం సాధ్యం కాదని చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఇక్కడి వరకే వచ్చిందంటున్నారు.

రాజ్ భవన్ లో ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయించాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనేది ఇప్పుడు కీలకమైన అనుమానంగా మారింది. గవర్నర్ పేరు చెప్పుకుని ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఇంత కాలం తమ ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని అనుకున్న వారు.. ఇప్పుడు గవర్నర్ బదిలీపై వెళ్తూంటంతో… జరిగిన విషయం అంతా.. మీడియాకు లీక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై నిజానిజాలు బయటకు రావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

చిరుని రెచ్చ‌గొడితే వైకాపాకే న‌ష్టం!

చిరంజీవి మీద వైకాపాకు మ‌ళ్లీ కోపం వ‌చ్చింది. మొన్న‌టికి మొన్న జ‌న‌సేన‌కు రూ.5 కోట్లు ఇచ్చినందుకు చిరుని టార్గెట్ చేశారు. ఇప్పుడు `పిఠాపురంలో ప‌వ‌న్‌కు ఓటేయ్యండి` అన్నందుకు చిరుపై నోళ్లేసుకుని ప‌డిపోతున్నారు. మెగా...

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేసిన క్యాట్

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. ఆయనపై రెండో సారి విధించిన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని క్యాట్ తీర్పు చెప్పింది. టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన...

ఉప్పల్ లో మ్యాచ్ కు వాన గండం..?

మరికొద్ది గంటల్లో హోం గ్రౌండ్ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close