ఏప్రిల్ 1 నుంచి బార్లన్నీ బంద్ – కానీ !

మద్యాన్ని స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలెంజ్ చేశారు. కానీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉన్నా.. ఆయన దుకాణాలు..బార్ల సంఖ్యను పెంచడమే కాకుండా..మూడేళ్లకుపైగా లైసెన్సులు ఇచ్చి మాట తప్పానని రికార్డుల పరంగా రాసిచ్చేశారు. అయితే ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మాత్రం.. ప్రజలకు భయపడి..హామీ ఇవ్వకపోయినా మద్య నియంత్రణ చేస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ సీఎం చౌహాన్.. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని ఊహించి.. కొత్త ప్లాన్ బయటకు తీశారు. అదే మద్య నియంత్రణ. మధ్యప్రదేశ్ లో అన్ని బార్లను మూసివేస్తూ కొత్త ఎక్సైజ్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. షాపుల్లో పర్మిట్ రూములను కూడా అనుమతిచరు. విద్యాసంస్థలు, బాలికల హాస్టళ్లు, మత స్థలాల నుంచి మద్యం షాపుల దూరాన్ని 50 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచుతారు.

ఇలా ఊరికే మద్య నియంత్రణ చేస్తే ఓట్లు వేయరు కాబట్టి బీజేపీ కొంత ప్లాన్ ప్రకారం వెళ్తోంది. బీజేపీ ఎంపీ ఉమా భారతి కొద్ది రోజులుగా మద్య నియంత్రణ చేపట్టాలని ఉద్యమం చేస్తున్నారు. షాపుల మీద దాడి చేయడం వంటివి చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో బార్లు బంద్ చేస్తూ ఉత్తర్వులిచ్చినట్లుగా భావిస్తున్నారు.
2018లో జరిగిన ఎన్నికల్లో 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే స్వల్ప మెజార్టీ వచ్చింది. చివరికి జ్యోతిరాదిత్య సింధియా పార్టీని ధిక్కరించి బీజేపీలో చేరిపోయారు. ఆయనతోపాటు ఆరుగురు మంత్రులు సహా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీపై తిరుగుబాటు చేశారు. చౌహాన్ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఇప్పుడు ప్రజా వ్యతిరేకత మొత్తం బీజేపీని భయపెడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close