అరెస్ట్ వద్దంటూ హైకోర్టుకెళ్లిన అవినాష్ రెడ్డి !

బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య చేసిన కేసులో సీబీఐ అరెస్ట్ చేస్తుందేమోనని అవినాష్ రెడ్డి వణికిపోతున్నారు. మూడో సారి ఆయన విచారణకు వెళ్లే సమయం దగ్గర పడటంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని ఆయన పిటిషన్ వేశారు. తనకు సీబీఐ 160 సీఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారని.. ఆ నోటీసులు ఇస్తే అరెస్ట్ చేయకూడదని ఆయన చెబుతున్నారు. కానీ ఆ సెక్షన్ కింద నోటీసులిచ్చినా విచారణకు సహకరించలేదన్న కారణం చూపి అరెస్ట్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో తుది ప్రయత్నంగా ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.

ఈనెల ఆరో తేదీన హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈనెల 4వ తేదీన పులివెందులలోని వైయస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అయితే తనకు ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాల వలన ఆరోజు విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు. దీంతో సిబిఐ అధికారులు ఈనెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఆయన మూడోసారి సిబిఐ విచారణకు హాజరుకానున్నారు. అలానే ఈనెల 12వ తేదీన వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఈ సారి అరెస్ట్ చేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తి రేపుతోంది. వై.ఎస్. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాష్ రెడ్డినే హత్య చేశాడని తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ను బట్టి చూస్తే.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి విషయంలో సీబీఐ చాలా దూకుడుగా విచారణ జరిపిందని.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చని కూడా చెబుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

వంగా గీతకు మంత్రిపదవా ? ఆళ్ల, మర్రి, గ్రంధి నవ్వుకుంటారు జగన్ గారూ !

కుప్పం వెళ్లి అక్కడి వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని చెబతారు జగన్ రెడ్డి, అక్కడ చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా అని జగన్ ఆయన మాటల్ని కామెడీ చేస్తారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close