మీడియా వాచ్ : కోర్ టీడీపీ ఫ్యాన్స్ మద్దతు కోల్పోయిన ఏబీఎన్ !

ఏబీఎన్, ఆంధ్రజ్యోతికి ఆదరణ ఉందంటే దానికి కారణం …. వైసీపీ వ్యతిరేకత , టీడీపీ సానుకూలత. వైసీపీకి వ్యతిరేకంగా ఏం రాస్తున్నారో అని ఆ పార్టీ నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తూంటారు. టీడీపీ వాళ్లు సహజంగానే కోర్ ఆడియన్స్. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన మూడు రోజులు … టీడీపీ గెలుస్తూంటే.. అసలు ఆ ఫ్లేవరే ఏబీఎన్‌లో కనిపించలేదు. ఆంధ్రజ్యోతి పత్రికతో పోలిస్తే కనీసం పది శాతం కవరేజీ కూడా లేదు. కనీసం గెలుస్తున్న అప్ డేట్స్ ఇవ్వలేదు. టీడీపీకి ఫేవర్ గా వచ్చే వార్తలు ఫాస్ట్ గా ఇస్తారేమో అని టీడీపీ క్యాడర్ అంతా ఏబీఎన్ వైపు చూస్తే నిరాశే మిగిలింది. టీవీ5, ఈటీవీ బెటరని వారు సోషల్ మీడియాలో నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసుకున్నారు.

నిజానికి ఏబీఎన్‌లో పరిస్థితులు మారిపోయాయి. వేమూరి రాధాకృష్ణ చానల్‌పై దృష్టి పెట్టడం ఎప్పుడో మానేశారు. దీంతో అక్కడ స్థిరంగా ఉండే మ్యాన్ పవర్ లేకుండా పోయింది. దీంతో డెస్క్ పై … ఏబీఎన్ సోల్ పై పట్టు ఉన్న వాళ్లంతా చానల్ ను వదిలేసిపోయారు. ప్రస్తుతం డెస్క్ ను లీడ్ చేస్తుంది.. పని చేస్తున్న సబ్ ఎడిటర్లు… ఇంచార్జులు అంతా తెలంగాణ. పైగా ఉద్యమంలో పాల్గొన్న బ్యాక్ గ్రౌండ్. వారికి ఏపీ విషయాలను లైట్ తీసుకుంటున్నారు. టీడీపీ అంశాలను అసలు పట్టించుకోడం లేదు.

చానల్ పై రాధాకృష్ణ అజమాయిషీ తగ్గిపోవడంతో ఉద్యోగుల వ్యవహారాలు కూడా మితిమీరిపోతున్నాయి. కొంత మంది సొంత ప్రయోజనాల కోసం చానల్ను వాడేసుకుంటున్నారన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. వెంకటకృష్ణ చర్చా కార్యక్రమం తప్ప ఇతర విషయాలు పట్టించుకోవడం లేదు. మొత్తంంగా ఏబీఎన్ పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా ఉంది. అందుకే టీడీపీ కోర్ ఆడియన్స్.. టీవీ5, ఈటీవీవైపు వెళ్లిపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close