దటీజ్ కేసీఆర్.. రైతులకు ఎకరాకు రూ. పదివేలు!

అకాల వర్షాలు, వడగళ్ల వాన దెబ్బకు నష్టపోయిన రైతులకు కేసీఆర్ ఎకరానికి రూ. పది వేలు ప్రకటించారు. ఇన్ పుట్ సబ్సిడీ అని.. మరొకటి.. ఈ సీజన్ డబ్బులు ఈ సీజన్‌లోనే ఇస్తాననే కథలు చెప్పలేదు. అలా ఫీల్డ్ లోకి వెళ్లి పంట పొలాలలను పరిశీలిచారు. అక్కడ ప్రకటన చేశారు. ఆయన తిరిగి ప్రగతిభవన్‌కురాక ముందే రూ.228కోట్లను విపత్తు నిధి నుంచి మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.

రైతులను ఆదుకోవాలని కేంద్రం దగ్గరకి పోయేది లేదని స్పష్టం చేశారు. తామే ఆదుకుంటామన్నారు. పంట నష్టంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఎలాంటి సాయం చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ఇండియాలోనే ఫస్ట్ టైం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. మొత్తం 2 లక్షల 28వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనాకు వచ్చారు. ఈ మొత్తానికి సరిపడా పరిహారం విడుదల చేశారు.

రైతులకు రైతు బంధు ఇస్తున్నారు. ఆ తరహాలోనే బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. కేసీఆర్ స్పందన రైతుల్ని సంతృప్తి పరిచింది. పంటల భీమా అని మరొకటి అని ఇబ్బంది పెట్టకుండా పరిహారం ఇస్తున్నారు. మూడు జిల్లాల్లో కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. భారీ నష్టం జరిగిందని.. అభిప్రాయపడ్డారు. నిజానికి పది వేల సాయం రైతులకు సరిపోదు కానీ.. మొత్తం నష్టపోయిన దశలో ఈ సాయం ఉపయోగపడుతుందని రైతులు సంతృప్తి పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close