రాహుల్ అనర్హతపై టీడీపీ, వైసీపీ స్పందించలేదేంటి?

రాహుల్ గాంధీ అనర్హతపై దేశం గగ్గోలు పెడుతుంది. రాహుల్ గాంధీనే వదల్లేదంటే ఇక ప్రతిపక్ష నేతలు మిగలరని.. నియంతృత్వం వచ్చేసినట్లేనని బీజేపీయేతర పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రజా ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి. కానీ ఏపీ రాజకీయ పార్టీలు మాత్రం పూర్తిగా అసలు ఈ అంశంపై తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కనీస స్పందన వ్యక్తం చేయలేదు. ఆయా పార్టీలు పూర్తిగా జాతీయ అంశాలు ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకించే అంశాలపై దృష్టి పెట్టాయి.

కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ బీజేపీకి ఉంది. ఇందులో వైసీపీకి బీజేపీ సపోర్ట్ నిన్నామొన్నటి వరకూ ఉంది. దానికి కారణం టీడీపీ. … బీజీపీని వ్యతిరేకించడమే. కానీ ఇప్పుడు టీడీపీ కూడా బీజేపీని వ్యతిరేకించడం లేదు. దీంతో రాజకీయంగా బీజేపీ కూడా .. టీడీపీని టార్గెట్ చేయడం లేదు. అనవసరంగా బీజేపీపై ఎదురుదాడి చేసి… ఆ పార్టీ మరో పార్టీకి అనుకూలం అయ్యేలా చేయకూడదని రెండు పార్టీలు డిసైడయ్యాయి. అందుకే స్పందించడం మానేశారు.

అయితే వైసీపీ క్యాడర్ మాత్రం సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి బాగా జరిగిందని సంకలు గుద్దుకుంటున్నారు. ఎందుకంటే జగన్ ను అన్యాయం చేశారట. కేసుల్లో ఇరికించారట. అసలు కాంగ్రెస్ కు అన్యాయం చేసిందే జగన్ కదా అని ఇతరులు అంటే వారి దగ్గర సౌండ్ ఉండదు. ఇక టీడీపీ క్యాడర్ మాత్రం మోదీ నియంతృత్వ తీరును ఖండిస్తున్నారు. రాహుల్ గాంధీపై అనర్హతా వేటుపై తమ అభిప్రాయాలను బలంగానే చెబుతున్నారు. కారణం ఏదైనా ఇప్పుడు ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం తలపడుతున్నాయి. ఇలాంటి సమయంలో జాతీయ అంశాల్లో తలదూర్చి… వేరే పార్టీకి అడ్వాంటేజ్ ఇవ్వాలని రెండూ పార్టీలూ అనుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close