మరో ఇద్దరు ఏపీ “సిన్సియర్ ఐఏఎస్, ఐపీఎస్‌”లకు జైలు శిక్ష !

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ కృష్ణ బాబు , ఐపిఎస్ ద్వారకా తిరుమలరావు లకు నెల రోజులు జైలు శిక్ష,1000/- జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. 16వ తేదీ లోగా రిజిస్ట్రార్ జ్యూడిషియల్ ముందు లొంగిపోవాలని వారిద్దరినీ ఆదేశించింది. వీరిని శిక్ష అనుభవించేందుకు వెంటనే జైలు కు పంపాలని రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. వీరితో పాటు మరో ముగ్గురు ఆర్టీసీ అధికారులకూ శిక్ష విధించింది. తమ సర్వీసును క్రమబద్దీకరించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. వారి సర్వీస్‌ను క్రమబద్దీకరించాలని వారి జీతాలకు ఏడు శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని ఆదేశించింది. 2022 ఆగస్టులోనే హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం చెల్లించలేదు. సర్వీసును క్రమబద్దీకరించలేదు. దీంతో ఆ ఉద్యోగులుధిక్కరణ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అధికారుల తీరుపై మంమడిపడింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు తీర్పును ఉల్లంఘించారని స్పష్టం చేసింది. అయితే తాము ఈ తీర్పును అప్పీల్ చేశామని.. ఆర్టీసీ లాయర్లు హైకోర్టులో వాదించారు. కానీ స్టే రాలేదు కదా.. అలాంటప్పుడు ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు మండిపడింది. జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

ఎంటీ కృష్ణ బాబు, ద్వారకా తిరు్మల రావు సిన్సియర్ ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకూ వారిపై ఎలాంటి రిమార్కులు లేవు. అయితే ఇప్పుడు ఏకంగా విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు.. కోర్టు తీర్పును ఉల్లంఘిచినందుకు జైలుకు వెళ్లాల్సి వస్తోంది. అప్పీల్ చేసి శిక్ష ను తగ్గించుకుంటారో లేకపోతే స్టే తెచ్చుకుంటారో లేదో కానీ.. ఇలా వారి కెరీర్‌లో మాత్రం ఈ మచ్చ అలా ఉండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close