నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రధాని మోదీకి నమ్మిన బంటు !

నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ కుమార్తె పరకాల వాజ్మయి పెళ్లి ప్రతీకో దోషి అనే యువకుడితో జరిగింది. బెంగళూరులో ఎవర్నీ పిలవకుండా అతి కొద్ది మమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసేసారు. ఈ దోషి అటు నిర్మలా సీతారామన్ స్వరాష్ట్రానికి చెందిన తమిళనాడు వారు కానీ.. తండ్రి పరకాల ప్రభాకర్ కు చెందిన ఏపీ కి కానీ చెందిన వారు కాదు. ఆయన గుజరాత్ కు చెందిన యువకుడు. ప్రధాని మోదీకి నమ్మిన బంటు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఇప్పటికే కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తి.

ప్రతీక్ దోషి .. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రీసెర్చ్ అసిస్టెంట్ గా సీఎంవోలో చేరారు. ప్రధాని మోదీ నమ్మకాన్ని చూరగొన్నారు. 2019లో ప్రధాని మోదీ రెండో సారి గెలిచిన తర్వాత ప్రతీక్ దోషిని ప్రధానమంత్రి కార్యాలయంలో నియమించారు. ఆయనకు పీఎంవోలో మంచి పలుకుబడి ఉంది. హోదాలో శాస్త్ర, సాంకేతిక సలహాదారుగా ఉన్నప్పటికీ చాలా విషయాల్లో ఆయన ప్రధాని మోదీకి సహాయకారిగా ఉంటారని చెబుతున్నారు. పరకాల వాజ్మయికి.. ప్రతీక్ దోషిది ప్రేమ వివాహమా.. లేకపోతే నిర్మలా సీతారామన్ కుదిర్చిన వివాహమా అన్నదానిపై స్పష్టత రాలేదు.

నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం చాలా నిరాడంబరంగా… వీఐపీల్ని ఎవర్నీ పిలవకుండా నిర్వహించారు. దీనికి ప్రతీక్ దోషి ఆదర్శాలుకూడా ఓ కారణం అంటున్నారు. ఎటువంటి ప్రచారానికి ఇష్టపడకుండా లో ప్రోఫైల్ ఉండే దోషి.. తన పెళ్లిని కూడా అలాగే కుటుంబ వ్యవహారంగా జరుపుకోవాలనుకున్నారని.. ఆ మేరకు అలాగే నిర్వహించుకున్నారని అంటున్నారు. మరో వైపు విడుదల అయిన పెళ్లి వీడియోల్లో ఎక్కడా పరకాల ప్రభాకర్ కనిపించకపోవడంతో.. కుమార్తె పెళ్లికి ఆయన వెళ్లలేదా అన్న చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close