ఇప్పుడు జేపీ నడ్డా, అమిత్ షానూ కొడతారా ? : రఘురామ

ఏపీకి వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డాలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారని.. అవన్నీ గతంలో తాను మీడియాతో మాట్లాడుతూ చేసినవేనని.. ఇప్పుడు తనను కొట్టించినట్లే.. అమిత్ షా, నడ్డాలను కూడా కొట్టిస్తారా అని సీఎం జగన్‌కు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నలు సంధించారు. ఏపీ ప్రభుత్వం అవినీతిమయమని అమిత్ షా చెప్పారని .. ఏపీలో ల్యాండ్, ఇసుక, మైనింగ్, ఎడ్యుకేషన్ అన్నిట్లో అవినీతి జరుగుతోందని నడ్డా విమర్శించారన్నారు. నడ్డా, అమిత్ షా చెప్పిన మాటలే నేను గతంలో చెప్పానని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నానని నన్ను అరెస్ట్ చేసి నా పై రాజద్రోహం కేసు పెట్టారన్నారు.

రఘురామకృష్ణరాజుపై కేవలం మీడియాతో మాట్లాడినందుకే ప్రభుత్వంపై కుట్ర పన్నారని ఏపీసీఐడీ అధికారులు సుమోటోగా రాజద్రోహం కేసు పెట్టి ఆయన పుట్టిన రోజు నాడు ఇంట్లో ఉండగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి గుంటూరు సీఐడీ ఆఫీసులో భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయంలో హైదరాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి లో నిర్వహించిన పరీక్షల్లో స్పష్టమయింది. తనపై దాడి చేసిన వారిని శిక్షించాల్సిందేనని ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి పోరాడుతున్నారు. రెండేళ్లు దాటిపోవడంతో ఏపీలో తనను హింసించిన సాక్ష్యాలు ధ్వంసం చేస్తారన్న కారణంతో వాటిని భద్రపరచాలని న్యాయపోరాటం చేస్తున్నారు.

కాల్ రికార్డులు.. అలాగే తనకు చేసిన టెస్టుల రిపోర్టులు భద్రం చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కేసు సీబీఐకి ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ క్రమంలో తాను అన్న మాటల్నే.. అమిత్ షా, నడ్డాలు అన్నారని.. వాళ్లనూ కొడతారా అనే ప్రశ్నలు సంధించడం వైసీపీలోనూ చర్చనీయాంశం అవుతోంది. నిజానికి పార్టీని ధిక్కరించిన వారిని వైసీపీ ఎప్పటికప్పుడు సస్పెండ్ చేస్తోంది కానీ..రఘురామ జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close