రాజగోపాల్ రెడ్డిని నమ్మి నట్టేట మునుగుతున్న బీజేపీ !

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి గోడ మీద పిల్లి తరహా రాజకీయాలు చేస్తున్నారు. 2018లో కాంగ్రెస్ ఓడిపోగానే.. ఆయన బీజేపీలో చేరిపోతానంటూ వెళ్లారు. చేరక ముందే అక్కడ ఆయన అతిని తట్టుకోలేకపోయారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ప్రచారం చేసుకోవడం ప్రారంభించడంతో మొదట్లోనే కత్తిరించేశారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ కు మద్దతుగా మాట్లాడటం ప్రారంభించారు. అసెంబ్లీకి హాజరయ్యారు. బండి సంజయ్ బీజేపీ చీఫ్ అయ్యాక.. ఆ పార్టీ కొద్దిగా పుంజుకోవడంతో మళ్లీ ఆ పార్టీ బాట పట్టారు.

చివరికి మునుగోడులో రాజీనామా చేస్తానని ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఎక్కడా లేనంత ఊపు వస్తుందని చెప్పి నమ్మించి అదే పని చేశారు. ఆయనకు సోదరుడు కూడా పరోక్షంగా అండగా నిలిచారు. తీరా.. మునుగోడులో ఓడిపోవడంతో… బీజేపీకి అప్పటి వరకూ వచ్చిన హైప్ అంతా కరిగిపోయింది. దీంతో రాజగోపాల్ రెడ్డితో చేసిన ప్రయోగం వికటించినట్లయింది. బీజేపీ పలుకుబడి తగ్గిపోవడంతో రాజగోపాల్ రెడ్డి కూడా జంప్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బీజేపీలో ఆయనకు రెండు పదవులు ఇచ్చినా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు.

కాంగ్రెస్ లో చేరాలని ప్రజల నుంచి ఒత్తిడి ఉందని ఆయన చెబుతున్నారు. ఆయన సోదరుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు కాబట్టి… ఆ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం.. వెంటనే మునుగోడు టిక్కెట్ దక్కడం సులువే. కానీ ఇలాంటి వారిని నమ్ముకున్న రాజకీయ పార్టీలు మాత్రం నిండా మునిగిపోతాయని బీజేపీ ఉదంతమే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీనే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close