ప్రమాణస్వీకారానికి అందరికి రేవంత్ ఆహ్వానం – చంద్రబాబుకు కూడా !

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎల్పీ స్టేడియడంలో జరగనుంది . తొలి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నందున గ్రాండ్ గా… అందరి సమక్షంలోనే చేసుకోవాలని రేవంత్ రెడ్డి డిసైడయ్యారు. అందుకే ఏఐసీసీ అగ్రనేతలందర్నీ పిలిచారు. కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలకు చెందిన వారిని పిలిచారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల్ని తన స్నేహితుల్ని కూడా పిలిచారు. ఈ జాబితాలో కేసీఆర్, కేటీఆర్, జగన్ రెడ్డి, చంద్రబాబు కూడా ఉన్నరు. ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ప్రియాంక హాజరవుతున్నారు.

సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కూడా హాజరు అవుతారు. కేసీఆర్ ను దిగిపోతున్న ముఖ్యమంత్రి హోదాలో ఆహ్వానించడం కామన్. అయితే ఇంత వరకూ కేసీఆర్ రేవంత్ రెడ్డికి కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పలేదు. ఆయన ప్రమాణస్వీకారానికి హాజరవుతారన్న గ్యారంటీ లేదు. జగన్ రెడ్డి కి కూడా ఆహ్వానం పంపారు. కానీ హాజరైతే.. కాంగ్రెస్ కూటమికి దగ్గరవుతున్నారని బీజేపీ అనుకుంటుంది అదే జరిగితే కష్టాలొస్తాయి కాబట్టి జగన్ రెడ్డి హాజరు కాకపోవచ్చు. తన తరపున ఎవరినైనా పంపొచ్చని భావిస్తన్నారు.

చంద్రబాబునాయుడు కూడా ఇంత వరకూ విషెష్ చెప్పలేదు. ఆయన కూడా హాజరవడం కష్టమే. అయితే టీడీపీలో ఉండగా రేవంత్ తో స్నేహంగా ఉన్న టీడీపీ యువనేతలు మాత్రం హాజరయ్యే అవకాశం ఉంది. సినీ ప్రముఖుల్ని కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఎవరెవరు వస్తారన్నది రేపు తేలుతుంది.. మరో వైపు తాను నెల రోజులక్రితం హామీ ఇచ్చిన రజనీ అనే దివ్యాంగురాలిని కూడా రేవంత్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close