జనసేనకు గండంగా మారిన జోగయ్య లేఖలు !

సీనియర్ నేత హరిరామజోగయ్య మంచం మీద ఉన్నారు. ఆయన రాస్తున్నారో ఆయన తరపున ఎవరైనా రాస్తున్నారో కానీ జనసేన పార్టీని ఇబ్బంది పెట్టేలా లేఖలు బయటకు వస్తున్నాయి. వాటిని వైసీపీ సోషల్ మీడియా కుల చిచ్చు పెట్టేందుకు ఉపయోగించుకుంటోంది. వాటిని తామే రెడీ చేయిస్తున్నట్లుగా ప్రచారం చేసేసుకుంటున్నారు. ఈ వ్యవహారం జనసేన వర్గాల్లోనూ కలకలం రేపుతోంది. టీడీపీ, జనసేన కూటమి గెలిస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతరని లోకేష్ చెప్పారు. చంద్రబాబు కాకుండా మరొకరు ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ అనుకోరు. పవన్ కల్యాణ్ కూడా చెప్పలేదు.

ముందు పోటీ చేసిన స్థానాల్లో గెలవడం ముఖ్యమని చెబుతూ వస్తున్నారు. కానీ లోకేష్ ఇంటర్యూలో అన్న మాటల్ని వైసీపీ సోషల్ మీడియా అన్న మాటల్ని .. పట్టుకుని జోగయ్య లేఖ రాశారు. అందులో కాపు కులాన్ని పవన్ మోసం చేస్తున్నారన్నట్లుగా ఆరోపించారు. కాపు సంక్షేమసేన పేరుతో ఈ రచ్చ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన మరో లేఖ విడుదల చేశారు. తన పేరుతో సర్క్యూలేట్ అవుతున్న లేఖ నిజం కాదన్నారు. కాసేపటికి మరో లేఖ వచ్చింది. పవన్ దగ్గర నంచి స్పష్టమైన సమాధానం వచ్చిందని ఎన్నికలయ్యాకనే ముఖ్యమంత్రి ఎవరో తెలుతుందని చెప్పారన్నారు. అయితే గత ఎన్నికల్లో పదివేల ఓట్లు కన్నా ఎక్కువ తెచ్చుకున్న 60 సీట్లను జనసేన తీసుకోవాలని అయన సూచించారు.

జోగయ్య వ్యవహారం .. జనసేన పార్టీని కాపులకు మాత్రమే పరిమితం చేసేలా అదీ కూడా.. వారిపై అనుమానాల్ని పెంచి.. దూరం చేసేలా ఉండటతో జోగయ్యతో వైసీపీ నేతలు కావాలనే ఇలా చేయిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన బాగు కోరేవారు ఎవరూ.. ఇలాంటి పనులు చేయరని.. రాజకీయ పరిస్థితుల గురించి తెలిసి కూడా ఎందుకు జనసేన భవిష్యత్ ను చెడగొట్టేలా చేస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close