ఏపీ కాగ్ రిపోర్ట్ : 2023లో 341 రోజులు చేబదుళ్లు – 152 రోజులు ఓవర్ డ్రాప్ట్ !

ఏపీ ప్రభుత్వాన్ని జగన్ రెడ్డి ఎంత అడ్డదిడ్డంగా నడిపారో..ఎంత ఆర్థిక అరాచకానికి పాల్పడ్డారో కాగ్ రిపోర్టు వెల్లడించింది. సంవత్సరం మొత్తం ప్రతీ రోజూ.. ఆర్బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్ ఖాతా కింద అప్పు తీసుకుంటూనే ఉన్నారు. ఇక ఓవర్ డ్రాఫ్ట్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఐదు నెలల పాటు ఏపీ సర్కార్ ఓడీలోనే ఉంది. అసెంబ్లీకి కాగ్ ఇచ్చిన రిపోర్టులోనే ఇదంతా ఉంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 341 రోజుల పాటు వేస్అండ్ మీన్స్ అడ్వాన్సులను ఏపీ వినియోగించుకుంది. రిజర్వు బ్యాంకు ఖాతాలో రూ.1.94 కోట్ల కంటే తక్కువ నిల్వల కారణంగా ఏడాదిలో 1,18,039 కోట్లను వేస్ అండ్ మీన్స్ గా వాడుకుంది. దీనిపై వడ్డీ చెల్లించింది. ఇదే ఆర్ధిక సంవత్సరంలో 152 రోజుల పాటు ఏపీ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వాడుకుంది.

మొత్తం రూ. 57,066 కోట్ల మేర ఓవర్ డ్రాఫ్ట్ ఏపీ వాడుకుంది. దీనికి కూడా భారీగా వడ్డీ చెల్లించింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 73 మార్లు బహిరంగ మార్కెట్ ద్వారా రూ. 57,478 కోట్ల మేర ఏపీ అప్పు తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఏడాదిలో రూ. 8,411 కోట్ల మేర ఏపీ అప్పు తెచ్చింది.మూలధన వ్యయం కేవలం రూ.7244 కోట్లకు మాత్రమే పరిమితం. రాష్ట్రస్థూల ఉత్పత్తిలో మూలధన వ్యయం కేవలం 0.55 శాతం మాత్రమనని ఆర్బీఐ బయట పెట్టింది. అంటే.. అప్పు చేసి మొత్తం పప్పుకూడు కింద ఖర్చ పెట్టేశారు.

ఆదాయం కోసం రూపాయి కూడా పెట్టలేదు. ఇక వివిద వివిధ కార్పోరేషన్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వ హామీలు రూ.1,38,875 కోట్లు ఉన్నట్లుగా తేల్చింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రూ.48,728 కోట్ల రుణాలు తీసుకోవాలని అంచనా వేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.52,508 కోట్ల రుణం తీసుకుంది. అసెంబ్లీ ఆమోదించిన మొత్తం కంటే అదనంగా రూ. 4,027 కోట్లను ఖర్చు చేసేశారు. ఎలా చూసినా ఏపీని వైసీపీ దివాలా తీయించిందని.. ఇన్ డైరక్ట్ గా కాగ్ తేల్చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close