దుల్క‌ర్‌, అడ‌విశేష్.. ఓ మ‌ల్టీస్టార‌ర్‌!

టాలీవుడ్ లో మ‌ల్టీస్టార‌ర్ల జోరు ఎక్కువైంది. ఇద్ద‌రు, ముగ్గురు హీరోలు క‌లిసి న‌టించ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ద‌ర్శ‌కులు కూడా రెండు భాష‌ల‌కు చెందిన స్టార్ల‌తో సినిమాలు చేయ‌డానికి మ‌క్కువ‌గా ఉన్నారు. అందులో భాగంగా మ‌ల‌యాళం నుంచి దుల్క‌ర్ స‌ల్మాన్.. తెలుగు నుంచి అడ‌విశేష్‌ల‌ను క‌లిపి ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొందించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం అవుతున్నాయి. ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన ఓ యువ ద‌ర్శ‌కుడు.. ఓ క‌థ రాసుకొన్నాడు. టాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ క‌థ చేయ‌డానికి ‘ఓకే’ అనేసింది.

అడ‌విశేష్‌, దుల్క‌ర్ అయితే కాంబినేష‌న్ ప‌రంగానూ కొత్త క్రేజ్ వ‌స్తుంద‌న్న‌ది నిర్మాత‌లు భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోల‌కూ క‌థ‌లు వినిపించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇద్ద‌రు హీరోలూ త‌మ నిర్ణ‌యాన్ని తెలియ‌జేయాల్సివుంది. అడ‌విశేష్, దుల్క‌ర్ ఇద్ద‌రూ క‌థ‌ల విష‌యంలో చాలా కేర్ తీసుకొంటారు. కొత్త కొత్త జోన‌ర్లు ట్రై చేస్తుంటారు,. ఇద్ద‌ర్నీ ఒకే ఫ్రేమ్‌లో చూడ‌డం నిజంగా క‌నుల పండ‌గే. తెలుగులో దుల్క‌ర్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ‘సీతారామం’తో ఓ క్లాసిక్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తేజా స‌జ్జా హీరోగా న‌టిస్తున్న చిత్రంలోనూ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ నిర్మిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close