సుకుమార్- రాజమౌళి.. వెరీవెరీ స్పెషల్

సుకుమార్ అంటే రాజమౌళికి చాలా చాలా ఇష్టం. ‘జగడం’లో సుకుమార్ కి టేకింగ్ కి మరిసిపోయి అందులో ఓ సన్నివేశం గురించి రాజమౌళి తన అనుభవాన్ని పంచుకోవడం చాలా మందికి తెలిసే వుంటుంది. సుకుమార్ లోని క్రియేటివిటీని మాస్ పల్స్ ని సాటి దర్శకుడిగా రాజమౌళి వివరించి చెప్పడం అప్పట్లో ప్రత్యేకంగా నిలిచింది. అక్కడితో అయిపోలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా సుకుమార్ పై తన అభిమానాన్ని తెలియజేస్తునే వున్నారు రాజమౌళి.

మహేష్ బాబు తో సుకుమార్ తీసిన ‘వన్.. నేనొక్కడినే’ బాక్సాఫీసు వద్ద సరిగ్గా ఆడలేదు. చాలా తికమక సినిమా అనే రివ్యూలు వచ్చాయి. ఆ సమయంలో కూడా సుకుమార్ కు అండగా నిలబడ్డారు జక్కన్న. ఆ సినిమాలో సుకుమార్ టేకింగ్, క్రియేటివ్ స్కిల్ ని ప్రసంశిస్తూ ప్రత్యేకంగా ఒక వీడియో చేశారు. రాజమౌళి వీడియో చేసిన తర్వాత ఆ సినిమాలోని ప్రత్యేకత ఏమిటో ఇంకాస్త మెరుగ్గా జనాల్లోకి వెళ్ళింది.

ఇప్పుడు సుకుమార్-రామ్ చరణ్ కలసి మళ్ళీ సినిమా చేయబోతున్నారు. ప్రకటన వచ్చినప్పటినుంచే ఈ సినిమా అంచనాలు ఆకాశానికి తాకాయి. దీనికి కారణం కూడా రాజమౌళినే. ఓ సందర్భంలో ఈ సినిమా గురించి మాట్లాడారు జక్కన్న. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న సినిమాలో ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ ఓ అద్భుతం. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్‌ సీన్‌ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్‌ ఎడ్జ్‌కు వచ్చేస్తారని మాత్రం కచ్చితంగా నమ్ముతున్నాను”అని రాజమౌళి గతంలో చేసిన ఓ కామెంట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ సినిమా అనౌన్స్ మెంట్ కంటే రాజమౌళి కామెంటే గొప్ప బజ్ క్రియేట్ చేసింది. ఏదేమైనా.. పరిశ్రమలో ఇద్దరు అగ్ర దర్శకుల మధ్య ఇంతటి చక్కని అభిమానం స్నేహపూర్వక వాతావరణం వుండటం మెచ్చుకొదగ్గ విషయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close