చైతన్య : “అన్నీ విని” సర్వం పోగొట్టుకుంది కేసీఆరే !

కొన్నాళ్ల కిందట ఓ తెలుగు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్‌కు దేవుడు ప్రత్యక్షమయి ఏం కావాలో కోరుకోమంటారు. ఎదుటి వారు మనసులో ఏమనుకున్నా తనకు వినిపించేలా వరమివ్వండి అని కోరుకుంటాడు బ్రహ్మానందం. మొదట్లో ఒకరిద్దరు అనుకున్నవి తెలుసుకుని బాగానే ఉందనుకుంటాడు.. కానీ రాను రాను తన గురించి తన కుటుంబసభ్యులు, మిత్రులు సహా అందరూ మనసులో అనుకుంటున్న మాటలు విని మానసికంగా కుంగిపోతాడు., తనకీ వరం వద్దు మహాప్రభో అని దేవుడికి దగ్గరకు పోతాడు. దర్శకుడు ఈ సీన్ ను కామెడీగా వాడుకుని ఉంటాడేమో కానీ.. లోతైన అర్థం ఉంది. అందరి విషయాలు సీక్రెట్‌గా తెలుసుకుంటే.. ఆ తెలుసుకున్న వాడికే మనశ్శాంతి ఉండదు. ఆ తెలిసిన వివరాలతో తీసుకునే చర్యలతో సర్వం కోల్పోతారు. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతోంది అచ్చంగా అదే. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసమో.. ఎందుకోసమో అందరికీ తెలుసు. కానీ అన్నీ తెలుసుకుని సర్వం కోల్పోయారు. ఇప్పుడు చింతించినా ప్రయోజనం లేదు. ఎందుకంటే చేతులు కాలిపోయాయి.

సర్వం కోల్పోయిన కేసీఆర్

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు సంచలనం. ఫోన్ ట్యాపింగ్ బాధితుడే ముఖ్యమంత్రి కావడంతో ఆ మూలాలన్ని బయటకు తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తాడు. బాధ్యుల్ని చట్ట ప్రకారం శిక్షిస్తారా లేదా అన్నది తర్వాత కానీ ప్రజల ముందు మాత్రం పెడతారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఏం జరిగిందో ప్రజలు చర్చించుకుంటారు. ఇదే పెద్ద శిక్ష అనుకోవచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేసి.. అందరి మాటలు విని .. సర్వం పోగొట్టుకుంది మాత్రం కేసీఆర్ . బాధితులకు జరిగిన నష్టం ఏమీ లేదు. ఒకరు ఏకంగా సీఎం అయ్యారు.. మరెంతో మంది కొన్ని రోజులు బాధపడి సైలెంట్ అయి ఉంటారు.. పూర్తిగా నష్టపోయి దిగులు చెందుతోంది మాత్రం అన్నీ చేయించిన వారే. ఆయనే కేసీఆర్

అన్నీ తెలుసుకోవడం ప్రమాదకరం !

ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేశారు ? . రాజకీయ శత్రువుల మీద కాదు.. హితులు, సన్నిహితులు మీద కూడా చేశారు. ఆ వివరాలతో కేసీఆర్ అందర్నీ దూరం చేసుకున్నారు. రెండో సారి గెలిచిన తర్వాత హరీష్ రావును ఎందుకు దూరం పెట్టారు ?. ఈటల రాజేందర్ ను ఎందుకు దూరం పెట్టారు ?. చివరికి వారిపై ఏ మాత్రం నమ్మకం లేని పరిస్థితులకు ఎందుకు వచ్చారు ?. తప్పనిసరిగా హరీష్ రావును అంటి పెట్టుకున్నారు కానీ.. ఆయనపై కేసీఆర్ కు ఇసుమంతైనా నమ్మకం లేకుండా ఎందుకు పోయింది ?. చివరికి తన వెన్నంటి ఉండే.. జోగినిపల్లి సంతోష్ కుమార్ ని కూడా దూరం పెట్టాల్సి వచ్చింది. ఆయన భార్యపైనా ట్యాపింగ్ ప్రయోగం చేశారు. ఇవన్నీ కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా పోయింది. మనశ్శాంతి కరువయింది. ప్రతి ఒక్కరి జీవితంలోకి తొంగి చూడటం వల్లనే ఇదంతా జరిగిందని ఎవరైనా కాదనగలరా ?

తెలియకూడదని విషయాలు కూడా తెలుస్తాయి.. తట్టుకునే శక్తి ఉంటుందా ?

నేటి సమాజంలో భార్య భర్తల ఫోన్లు కూడా ఒకరికొకరు చూసేందుకు అంగీకరించరు. థంబ్ ప్రొటెక్షన్ పెట్టేసుకుంటారు. నిజానికి అలా పెట్టుకున్న వారంతా తప్పు చేస్తున్నట్లు కాదు. కానీ ఫోన్ లో ఉన్న వాటిని చూస్తే అపార్థాలు, అపోహాలకు గురవుతారు.. తర్వాత ఎన్ని చెప్పినా తాము అనుకున్నదే నిజం అనుకుంటారన్న భయం. అందుకే సీక్రెట్ ఈజ్ సీక్రెట్. అలా ఉంచుకోవడం వల్లే కాస్తంత బంధాలు నిలబడున్నాయని అనుకోవచ్చు. ఇది భార్యభర్తల మధ్యనే కాదు.. ఓ కుటుబం…సమూహం.. పార్టీ సభ్యులు.. లేదా స్నేహితులు..దేనికైనా అన్వయించుకోవచ్చు. అలాంటిది ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం రహస్యాలు తెలుసుకున్న వారు ఎవరైనా ప్రశాంతంగా ఉండగలరా ?. వాటి ద్వారా తీసుకునే చర్యలతో తనను తాను నష్టం చేసుకోరా.. ఇప్పుడు అదే జరిగింది. ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నది నిజమా కాదా అన్న సంగతి తర్వాత కానీ.. దాని వల్ల తెలుసుకున్న వారు తమ చర్యలను నియంత్రించుకోలేరు. ఫలితంగా నష్టపోతారు. జరిగింది అదే.

దిద్దుకోలేని తప్పు !

రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టారు. వారితో సొంత వారు టచ్ లో ఉన్నారని తెలుసుకున్నారు. సొంత వారిపై నిఘా పెట్టారు. ఇంకా ఎన్నో తెలుసుకున్నారు. ఇప్పుడు ఎవర్నీ నమ్మలేని పరిస్థితి. అధికారం పోయింది.. నమ్మిన లీడర్లు పోయారు. ఉన్న వారిని నమ్మలేరు. ఇక ఏం మిగిలి ఉంటుంది.. మానసిక అంశాంతి తప్ప.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close