వైసీపీ దళిత నేతలంతా కాంగ్రెస్ వైపే !

వైసీపీ దళిత నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. నంది కొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ లో చేరారు. వారు ఆ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మరో దళిత నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

గుంటూరు వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహిస్తున్న మాజీ మంత్రి డొక్కా మానిక్యవరప్రసాద్‌కు ఆ పార్టీలో గుర్తింపు లేదు. కనీసం ఎవరూ ప్రచారానికి కూడా పిలవడం లేదు. కొద్ది రోజుల కిందట జరిగిన సామాజిక బస్సు యాత్రలో పార్టీలో తన పరిస్థితిపై తానే బాధపడ్డారు. తనకు న్యాయం జరగడం లేదని.. ఒక్క సారి జగన్‌ను కలిపించాలని ఆయన వేదికపై ఉన్న నేతల్ని వేడుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయనను మరింతగా దూరం పెట్టారు.

కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆయనకు చంద్రబాబు గౌరవం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చారు. టిక్కెట్ ఇచ్చారు. పార్టీ వేదికలపై ఆయనకు మంచి గౌరవం లభించేది. అయితే మూడు రాజధానుల నాటకం సమయంలో .. డొక్కా కూడా తాను కన్నింగ్ పొలిటీషియన్‌నేనని నిరూపించారు. రాజధాని మార్పునకు వ్యతిరేకంగా రాజీనామా అంటూ నాటకమాడి వైసీపీలో చేరిపోయి.. తాను రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి మళ్లీ ఎన్నికయ్యారు.

ఆయనను ఇప్పుడు టీడీపీలోకి కూడా ఎవరూ ఆహ్వానించడం లేదు. కాంగ్రెస్ లో విలువ లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు చూసుకుంటున్నారు. షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close