మీడియా వాచ్ : బీబీసీని వెళ్లగొట్టినట్లే !

బీబీసీ బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఇండియాలో తన లైసెన్స్‌ను తన మాజీ ఉద్యోగులు పెట్టిన కంపెనీకి అప్పగించింది. భారత్‌లోని తన న్యూస్‌రూమ్‌ను మూసేసింది. నలుగురు బిబిసి మాజీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ‘కలెక్టివ్‌ న్యూస్‌రూమ్‌’ పేరిట ఏర్పడిన ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీకి బిబిసి ప్రచురణ లైసెన్సును అప్పగించింది.

1940లో భారత్ లో బీబీసీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఐదేళ్ల కిందట ప్రాంతీయ భాషల్లోనూ ప్రారంభించింది. కరోనా తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది బీబీసీ. అయితే 2021లో కేంద్రం దేశీయ డిజిటల్‌ మార్కెట్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతమేనని తేల్చింది. ఆ పరిమితి దాటిన కంపెనీలు తమ విదేశీ పెట్టుబడులను నియంత్రణలకు అనుగుణంగా తగ్గించుకోవాల్సి వచ్చింది.

బిబిసి ఇండియాలో 99.9 శాతం ఎఫ్‌డిఐ కావడంతో ఆ కొత్త నిబంధన గుది బండగా మారింది. విధి లేని పరిస్థితులలో కార్యకలాపాలను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కలెక్టివ్ న్యూస్ రూమ్ కు బీబీసీ పూర్తి మద్దతు ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేసింది బీబీసీ మాజీ ఉద్యోగులే. బీబీసీని టార్గెట్ చేసి గతంలో దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించిన తర్వాత నుంచే.. అసలు ఆ సంస్థను సాగనంపే కార్యక్రమాలు జరిగాయి. బీబీసీకి ఇండియాలో చోటు లేకపోవడం.. ఓ రకంగా భారత్ ఇమేజ్ ను.. ప్రపంచ మీడియా రంగంలో కాస్త పలుచన చేసేదేనని నిపుణుల అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close