చంద్రబాబు, పవన్ పై ఆ ఛానెల్ బ్యాన్..?

క్షణాల్లో బ్రేకింగ్ వార్తలు అందిస్తాం..ప్రజా సమస్యలను వెలికితీస్తాం.. అని చెప్పుకునే ఓ ప్రధాన స్రవంతి మీడియా వైఖరిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా ఆ ఛానెల్ లో పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంబంధించిన సమావేశాలు ఏమీ ప్రసారం కావడం లేదు. కేవలం జగన్ కు సంబంధించిన మీటింగ్స్ కు మాత్రమే కవరేజ్ ఇస్తుండటం మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

అయితే, సదరు చానెల్ ఉద్యోగులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీడియోలు వాడొద్దని పైనుంచి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు వైసీపీ సమావేశాలు మాత్రమే ప్రసారం చేయాలని… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీటింగ్స్ కు ఏమాత్రం కవరేజ్ ఇవ్వొద్దని ఆదేశాలు అందినట్లుగా సమాచారం. ఆ కారణంగానే ఆ ఛానెల్ లో పూర్తిగా కూటమి సమావేశాలపై అప్రకటిత నిషేధం కొనసాగుతుందన్న ప్రచారం జరుగుతోంది.

తెలుగు మీడియాలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాం. క్షణాల్లో జరిగే వార్తలను మీకందిస్తున్నాని గొప్పగా చెప్పుకుంటోంది ఆ ఛానెల్. అయినప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై దాడికి ప్రయత్నం జరిగితే ఆ అంశాన్ని ఎక్కడ కవర్ చేయకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ప్రజల కోసమే పని చేస్తాం అని చెప్పుకుంటూ..పెయిడ్ ఛానెల్ గా మారిందని నెటిజన్లు ఆ ఛానెల్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close