ఈసీ ఫెయిల్యూర్ – పోస్టల్ బ్యాలెట్స్ ఇలానా ?

ఏపీ ఎన్నికల సంఘం పనితీరు అత్యంత ఘోరంగా ఉంది. కనీసం పోస్టల్ ఓటింగ్ ను సరైన పద్దతిలో నిర్వహించడం కూడా చేత కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ స్మూత్ నిర్వహించడానికి నియమ నిబంధనలు పటిష్టంగా ఉంటాయి. ఎలా సింపుల్ గా అయిపోతుందో అంచనా వేసుకుని దానికి తగ్గట్లుగా పూర్తి చేయాలి. కానీ ఈసీ మొదటి నుంచి ఓ రకమైన తప్పుడు మార్గంలో వెళ్లింది. గందరగోళంతో ఎక్కువ మంది ఓట్లు వేయకపోతే చాలన్నట్లుగా వ్యవహరించింది.

మొదట పోస్టల్ బ్యాలెట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నది పెద్ద పజిల్ గా మార్చారు. నియోజకవర్గాల గందరగోళం ఏర్పరిచారు. మీడియాలో ఇదేం పని అని ప్రశ్నలు వినిపించడంతో రెండు రోజులు గడువు పెంచారు. ఫామ్ 12 తీసుకున్న తర్వాత పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై ఎం చేయాలన్నదానిపైనా గందరగోళం సృష్టించారు. చివరికి ఓటింగ్ విషయంలో ఏర్పడిన పరిస్థితులు చూసిన తర్వాత .. ఇలాంటి ఈసీనా సాధారణ ఎన్నికలు నిర్వహించేది అని ఆశ్చర్యం కలగడం సహజం.

ఎన్నికల నిర్వహణ చేతకాకపోతే మరో సమర్థమైన అధికారితో చేయించుకోవాలి.. కానీ ఈ వ్యవహారం అంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లుగా ఉంది. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులతో ఓట్లు వేయించకపోతే మంచిదన్న భావనకు వస్తున్నట్లుగా వ్యవహారం ఉంది. ఎవరైనా ఓటింగ్ పెంచాలనుకుంటారు కానీ.. ఇలా ఈసీ నిర్వాకంతో తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఈసీ ఫెయిల్యూల్ గానే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆయనొస్తే.. ఇక బీఆర్ఎస్ ను ఆపే వారే ఉండరు..!

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా...

ఘోర రైలు ప్రమాదం… కవచ్ టెక్నాలజీ ఏమైంది..?

దేశంలో ఒక దాని వెనక మరొకటి వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ ఘటన మరవక ముందే మరో ఘటన జరుగుతుండటంతో రైలు ప్రయాణాలు అంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా...

లోక్‌సభ స్పీకర్‌గా టీడీపీ అభ్యర్థి అయితే ఏకగ్రీవం !

లోక్‌సభ స్పీకర్ గా టీడీపీ అభ్యర్థిని నిలబెడితే తాము మద్దతు ఇస్తామని ఇండియా కూటమి ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఇప్పటికే ఎన్డీఏపై ఒత్తిడి తెస్తున్నరని తమకు స్పీకర్ పదవి ఇవ్వాలని...

చైతన్య : ఓడిపోయినప్పుడే ఈవీఎంలు గుర్తు రావడం అసలు రోగం !

ఈవీఎంలపై భారత రాజకీయ పార్టీల్లో ఎవరికీ నమ్మకం లేదు. చివరికి బీజేపీ, కాంగ్రెస్ కు కూడా లేదు. కానీ వారి అభిప్రాయాలు ఫలితాలు వచ్చినప్పుడల్లా మారిపోతూండటంతోనే సమస్య వస్తోంది. గెలిచిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close