నా మంత్రి పదవి పోదనే అనుకొంటున్నా: కడియం శ్రీహరి

వేర్వేరు పార్టీలలో ఉన్నవారే కాదు ఒకే పార్టీలో ఉన్నవారు కూడా కీచులాడుకోవడం బద్ధ శత్రువులు వలే వ్యవహరిస్తుండటం అందరూ చూస్తున్నదే. అటువంటప్పుడు పార్టీలో తమ బద్ధ శత్రువు వేరే పార్టీలోకి వెళ్ళిపోతే అప్పుడు వారు తనివితీరా ఒకరినొకరు తిట్టుకొనే అవకాశం లభిస్తుంది. తెదేపాలో కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి ఆ కోవకు చెందినవారే.

కడియం శ్రీహరి వెళ్ళిపోయినా తరువాత మిగిలిన ఇద్దరూ తమలో తాము కీచులాడుకొంటూనే, అదే నోటితో కడియాన్ని కూడా ఓ నాలుగు ముక్కలనేసి నాలిక దురద తీర్చుకొనేవారు. ఇప్పుడు ఎర్రబెల్లి కూడా తెరాసలోకి జంప్ అయిపోయారు కనుక రేవంత్ రెడ్డి ఒక్కరే ఇటు నుండి తిడుతుంటే, అవతల వైపు నుండి కడియం శ్రీహరి, ఎర్రబెల్లి మళ్ళీ ఒక్కచోటికి చేరినందున వాళ్ళిద్దరూ ఒకరినొకరు విమర్శించుకొంటూ మళ్ళీ అదే నోటితో రేవంత్ రెడ్డిని విమర్శించితే అదేమీ వింత కాబోదు.

తెరాసలోకి ఎర్రబెల్లి రాకను కడియం శ్రీహరి బహిరంగంగా వ్యతిరేకించకపోయినా, మనసులో వ్యతిరేకించకమానరు. ఒకవేళ ఎర్రబెల్లి కారణంగానే తన ఉపముఖ్యమంత్రి పదవి ఊడుతుందని తెలిస్తే ఇంకా వ్యతిరేకించవచ్చును. కారణం అదో కాదో తెలియదు గానీ కడియం శ్రీహరిని మంత్రి పదవిలో నుండి తప్పించబోతున్నారని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిప్పులేనిదే పొగరాదు కదా?

అయితే ఆయన వాటిని ఖండిస్తూ చెప్పిన మాటలు కూడా వాటిని ఇంకా బలపరుస్తున్నట్లే ఉన్నాయి. దీనిపై మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ “కేసీఆర్ నన్ను మంత్రివర్గంలో నుండి తప్పిస్తారని నేను అనుకోవడం లేదు. ఆయనే నన్ను ఏరికోరి మంత్రివర్గంలోకి తీసుకొన్న సంగతి మీ అందరికీ తెలుసు. నా వలననే మంత్రివర్గానికి ఒక రూపం ఏర్పడింది. కనుక ఎవరి కోసమో కేసీఆర్ నన్ను మంత్రి పదవి నుండి తప్పిస్తారని నేను అనుకోవడం లేదు,” అని చెప్పారు.

ఒకవేళ ఎర్రబెల్లికో లేదా కొత్తగా పార్టీలో చేరిన వేరెవరికో మంత్రిపదవి ఇచ్చేందుకు కడియం శ్రీహరిని మంత్రివర్గం నుండి తప్పించినట్లయితే అప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి? తెరాసపై అలిగి మళ్ళీ తెదేపాకి వెళ్లిపోతారా? లేకపోతే కేసీఆర్ ఇచ్చిన ఏదో ఒక పదవిలో సర్దుకుపోతారా? దానికి జవాబు కాలమే చెపుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close