రైల్వే జోన్ కోసం త్వరలో వైకాపా ఆమరణ నిరాహార దీక్ష

సుమారు రెండేళ్ళు పూర్తి కావస్తున్నా కేంద్రప్రభుత్వం ఇంతవరకు విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయలేకపోయింది. త్వరలోనే దానిపై ప్రకటన వెలువడుతుందని భాజపా నేత పురందేశ్వరి చెప్పారు కానీ నిర్దిష్టంగా ఎప్పటిలోగా అనే విషయం చెప్పలేనని అన్నారు. కనుక త్వరలో అంటే ఎప్పటిలోగా ఎవరికీ తెలియదు. కనుక దీనికి వైకాపా డెడ్-లైన్ పెట్టింది. ఏప్రిల్ 13లోగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించకపోయినయితే, ఏప్రిల్ 14న (డా. అంబేద్కర్ జయంతి) నుండి తమ పార్టీ విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడుతుందని ప్రకటించారు.

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, స్థానిక ఎంపి మరియు విశాఖపట్నం భాజపా అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు, పురందేశ్వరి అందరూ కూడా మాటలు చెపుతున్నారే తప్ప రైల్వే జోన్ సాధించలేకపోతున్నారని అమర్ నాథ్ విమర్శించారు. అమర్ నాథ్ నేతృత్వంలో వైకాపా పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి స్థానిక డివిజనల్ రైల్వే కార్యాలయం వద్ద కొంత సేపు ధర్నా చేసిన తరువాత డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీకి రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఒక వినతి పత్రం సమర్పించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close