మా ఎమ్మేల్యే చాలా మంచోడు…తప్పంతా ఆమెదే!

అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడిన ముసునూరు తహసిల్దార్ వనజాక్షిపై తెదేపా ఎమ్మేల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేయడాన్ని మహిళలే కాదు రాష్ట్ర ప్రజలందరూ ఖండించారు. అంతేకాదు ఆమె నిజాయితీని, సాహసాన్ని అందరూ మెచ్చుకొన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై దౌర్జన్యం చేసిన అధికార పార్టీకి చెందిన ఎమ్మేల్యేపై తక్షణమే తగు చర్యలు చేప్పట్టాలని ప్రజలు, ప్రతిపక్షాలు కూడా గట్టిగా డిమాండ్ చేసాయి. కానీ అందరూ ఊహించినట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మేల్యేని వెనకేసుకువచ్చి అక్రమ ఇసుక రవాణాని అడ్డుకొన్న తహసిల్దార్ దే తప్పు అని నిన్న మంత్రివర్గ సమావేశంలో తేల్చిచెప్పారు.

గ్రామ రికార్డుల గురించి క్షుణ్ణంగా అవగాహన గల తహసిల్దార్, రెవెన్యూ సిబ్బందికి తమ గ్రామ సరిహద్దుల గురించి తెలియవని అనుకోలేము. కానీ ఆమె తన పరిధికి అవతల ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించి ప్రజాప్రతినిధిని అడ్డగించారని నిందించడం మరొక పెద్ద తప్పు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి అక్రమంగా ఇసుక రవాణా చేయడం ఒక నేరమయితే తనని అడ్డుకొన్నందుకు మహిళాధికారిపై దౌర్జన్యం చేయడం మరొక తప్పు. అటువంటి వ్యక్తిని ప్రభుత్వం వెనకేసుకు రావడం అంతకంటే పెద్ద తప్పు.

చింతమనేని వద్ద ఇసుక త్రవ్వకాలకు అనుమతి ఉందా లేదా? ఆయన తహసిల్దార్ వనజాక్షి పరిధిలోకి రాని ప్రాంతంలో ఇసుక త్రవ్వకాలు చేస్తున్నారా? అనే విషయాలను పక్కనబెడితే ఆయన విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ సిబ్బందిపై, ఒక మహిళ అధికారిపై దౌర్జన్యం చేసారనే మాట వాస్తవం. కానీ ఆయన అధికార పార్టీకి చెందినవారు కనుక ముఖ్యమంత్రి ఆయనని వెనకేసుకు వచ్చారు. కానీ తన ప్రభుత్వం కోసం పోరాడిన వనజాక్షిని, ఆమె సిబ్బందిని మెచ్చుకొని సత్కరించకపోగా వారిదే తప్పు అని చెప్పడం చాలా దారుణం. దానివలన ఉద్యోగుల మనోస్తయిర్యం దెబ్బ తిని ఇక ముందు ప్రజా ప్రతినిధులు ఎవరయినా ఎటువంటి అక్రమాలకు పాల్పడుతున్నా చూసిచూడనట్లు ఊరుకోవలసి వస్తుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని రాజకీయ కోణం నుండి మాత్రమే చూస్తూ చాలా చక్కగా పరిష్కరించానని తృప్తి పడవచ్చును. సదరు ఎమ్మేల్యే కూడా ఆయనకు మరింత బాసటగా నిలబడవచ్చును. కానీ ముఖ్యమంత్రి స్వయంగా అవినీతిపరులకు అండగా నిలుస్తున్నారనే ప్రతిపక్షాల వాదనకు బలం చేకూర్చినట్లయింది. చంద్రబాబు నాయుడు తన నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు వచ్చిన ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకొన్నారు. సదరు ప్రజాప్రతినిధి చేత కనీసం అందరి సమక్షంలో తహసిల్దార్ వనజాక్షికి క్షమాపణలు చెప్పించి ఉన్నా ఆమెతో సహా ఉద్యోగులు ప్రజలు కూడా సంతోషించేవారు. కానీ తన ఉద్యోగధర్మం సక్రమంగా నిర్వహించిన వనజాక్షిదే తప్పు అని చెప్పడం ఎవరూ కూడా హర్షించలేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close