చిరుని కాద‌ని.. బాల‌య్య‌తో..??

చిరంజీవి 150వ సినిమాకి ఓ చిక్కుముడిగా మారింది న‌య‌న‌తార‌. చిరు ప‌క్క‌న క‌థానాయిక‌గా న‌టిస్తావా?? అంటే ముందు పారితోషికం పేరు చెప్పి బెంబేలెత్తించింది. ఆ త‌ర‌వాత కండీష‌న్లు పెట్టి క‌న్‌ప్యూజ‌న్ సృష్టించింది. ‘న‌య‌న వ‌ద్దులే..’ అని చిత్ర‌బృంద‌మే అనుకొనేలా తెలివిగా ప్లాన్ చేసింది న‌య‌న‌తార‌. ఇప్పుడు మాత్రం బాలకృష్ణ సినిమాకి అడ‌గ్గానే ఒప్పుకొని… టాలీవుడ్‌కి షాక్ ఇచ్చింది. ఔను.. బాల‌కృష్ణ న‌టించే 100వ చిత్రం గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంవ‌హించే ఈ చిత్రం మేలో ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌య‌న‌తార‌ని ఎంచుకొన్న‌ట్టు స‌మాచారం. న‌య‌న కూడా అడ‌గ్గానే మ‌రో మాట‌కు తావులేకుండా ‘ఓకే’చెప్పేసింద‌ని టాక్‌.

బాల‌య్య‌తో న‌య‌న‌కు మంచి రాపో ఉంది. సింహా, శ్రీ‌రామ‌రాజ్యం చిత్రాల్లో ఇద్ద‌రూ జోడీ క‌ట్టారు. ఇప్పుడు త‌న వందో సినిమాలోనూ న‌య‌న అయితేనే బాగుంటుంద‌ని బాల‌య్య భావిస్తున్నార్ట‌. త‌నే న‌య‌న‌కు స్వ‌యంగా ఫోన్ చేసి, త‌న వందో సినిమా గురించి న‌య‌న‌తో డిస్క‌ర్స్ చేశార‌ని, దాంతో న‌య‌న కాద‌న‌లేక‌పోయింద‌ని టాలీవుడ్ టాక్‌. గౌత‌మి పుత్ర‌లో మ‌రో క‌థానాయిక‌కీ అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆ క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో తేలిపోతుంది. సో.. బాల‌య్య – న‌య‌న‌ల జోడీ మ‌రోసారి చూడ్డానికి రెడీ అయిపోండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close