జగన్ సవాళ్ళకు మున్సిపల్ ఎన్నికలే సమాధానమా!

శాసన సభా నియోజక వర్గాల సైజులో వున్న పదకొండు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి తెలుగుదేశం హోమ్ వర్కు మొదలు పెట్టింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వరుసపెట్టి చేర్చేసుకుంటున్న నేపధ్యంలో దమ్ముంటే ఆఎమ్మెల్యేలను అనర్హులిగా చేసి ఉపఎన్నికలు నిర్వహించాలన్న సవాలు పై తెలుగుదేశం ఈ ఆలోచన చేస్తోంది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే ఓడిపోతారనే భయంతోనే అధికార పార్టీ ఉప ఎన్నికలకు వెనకడుగు వేస్తోందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రతిపక్షం నోరు మూయించడానికి లోకల్‌ బాడీ ఎలక్షన్లను వేదిక చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది.

విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు తిరుపతి కార్పొరేషన్లకు.. శ్రీకాకుళం, రాజాం, నెల్లిమర్ల, కందుకూరు, రాజంపేట మున్సిపాలిటీలకు వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు… వీటిల్లో కొన్నిటిపై కోర్టు స్టేలు ఉంటే… మిగిలిన చోట్ల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పుడా ఈ అడ్డంకులన్నీ క్లియర్ చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించి గెలిచి జగన్ సవాళ్ళకు సమాధానం ఇవ్వాలన్నది తెలుగుదేశం ఆలోచన. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలు తమవెంటే వున్నారని, ప్రజాభిప్రాయం మేరకే ఆపార్టీ ఎమ్మెల్లేలు తమ పార్టీలో చేరిపోతున్నారని నిరూపించడానికి మున్సిపాలిటీలను వేదిక చేసుకోవాలన్నది అధికారపార్టీ వ్యూహం.

ఇప్పటికే 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి మారిపోయారు. మరో వారం రోజుల్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేస్తున్నారు.గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మేయర్, ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలే జరిగేవి. వైఎస్ఆర్ హయాంలో పరోక్ష ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం ఇపుడు తన సొంత విధానమైన ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close