ఆ విషయంలో ఏపి నేతలు డా.లక్ష్మణ్ ఫాలో అవడం మంచిదేమో?

‘రౌతును బట్టే గుర్రం నడక’ అని పెద్దలు ఊరికే అనలేదు. అది తెలంగాణా భాజపా విషయంలో మరోసారి నిరూపితమయింది. ఇంతవరకు తెలంగాణా భాజపా అధ్యక్షునిగా కొనసాగిన కిషన్ రెడ్డికి తమ పార్టీ తెదేపాతో పొత్తులు పెట్టుకోవడం మొదటి నుంచి కూడా ఇష్టం లేదు. అధ్యక్షుడిగా ఇటీవల ఆయన నిర్వహించిన చిట్ట చివరి సమావేశంలో కూడా ఆయన తన వైఖరిని మరోమారు పార్టీ పరంగా పునరుద్ఘాటించారు. తెదేపా పట్ల ఆయనకున్న ఆ వ్యతిరేకత కారణంగానే రెండేళ్ళు గడుస్తున్నా తెలంగాణాలో ఆ రెండు పార్టీల మధ్య ఆశించినంత సఖ్యత ఏర్పడలేదు తత్ఫలితంగా రెండూ కూడా చాలా తీవ్రంగా నష్టపోయాయి.

ఆయన స్థానంలో కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికయిన భాజపా శాసనసభా పక్ష నేత డా. కె.లక్ష్మణ్, నిన్న పార్టీ బాధ్యతలు చేపట్టగానే అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడటం విశేషం. ఇది ఎన్నికల సమయమేమీ కాదు కనుక ప్రస్తుతం పొత్తుల గురించి మాట్లాడుకోవడం అనవసరం అని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడటమే తన ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. పార్టీలో అందరినీ కలుపుకొని వెళుతూ తెలంగాణా రాష్ర్టంలో భాజపాని బలోపేతం చేసేందుకు గట్టిగా కృషి చేస్తానని చెప్పారు.

తెదేపాతో యదాప్రకారం పొత్తులు కొనసాగిస్తామని ఆయన గట్టిగా నొక్కి చెప్పనప్పటికీ, అదే సమయంలో కిషన్ రెడ్డిలాగ తెదేపాను వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాడలేదు. ప్రస్తుతం పొత్తుల గురించి మాట్లాడుకోవలసిన సమయం కాదని వాస్తవిక దృష్టితో మాట్లాడారు. అంటే దానర్ధం ఆయన తెదేపాకు అనుకూలంగా ఉన్నట్లు కూడా కాదు. కానీ అప్రస్తుతమయిన ఆ అంశం గురించి మాట్లాడి రచ్చ చేసుకోవడం వలన రెండు పార్టీలకి ఇంకా నష్టామే తప్ప ఏమాత్రం లాభం ఉండదనే ఉద్దేశ్యంతోనే అయన దానిని ‘అప్రస్తుత అంశం’ గా ప్రకటించేశారు. అది చాలా మంచి నిర్ణయమనే చెప్పవచ్చును.

ఇటీవల కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు తెలంగాణాలో తెదేపాతో పొత్తుల తెగతెంపులు చేసుకోబోతున్నట్లు మాట్లాడిన తరువాత, ఆ ప్రభావం ఆంధ్రాలో తెదేపా-బీజేపీ కూటమిపై కూడా స్పష్టంగా కనబడింది. రెండు పార్టీలకి చెందిన నేతలు పరస్పరం ఘాటుగా విమర్శలు చేసుకోవడం అందరూ చూసారు. కనుక అప్రస్తుతమయిన ఆ అంశం గురించి ఇప్పటి నుంచే కీచులాడుకొని నష్టపోవడం కంటే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీని బలోపేతం చేసుకోవడమే మంచి ఆలోచన అని చెప్పవచ్చును.

ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్న తెదేపాతో చెట్టపట్టాలు వేసుకొని ముందుకు సాగాకపోయినా కనీసం దానితో ఘర్షణ పడకుండా ఉన్నట్లయితే, ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి తెదేపాతోనే కలిసి కొనసాగాలని భాజపా అధిష్టానం నిర్ణయించుకొంటే, దానితో కలిసి పనిచేసేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ తెదేపాతో తెగతెంపులు చేసుకోవాలని అధిష్టానం నిర్ణయించుకొంటే అదేమీ పెద్ద పని కాదు.

ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి కూడా డా. లక్ష్మణ్ చూపిన వైఖరినే అవలంభిస్తే మంచిది. అలా కాక తెదేపాను గట్టిగా విమర్శించడం, వ్యతిరేకించడం ద్వారానే రాష్ట్రంలో భాజపాని బలోపేతం చేసుకోవచ్చని భావిస్తే, దాని వలన ఆ పార్టీకి ఊహించని నష్టం కలుగవచ్చును. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపాకున్న బలం, ప్రజాధారణ భాజపాకి లేవు కనుక. ఆంద్రాలో నిలద్రొక్కుకొనేందుకు అది తెదేపాపై ఆధారపడి ఉన్నప్పుడు, ఉన్న ఆ ఒక్క ఆధారాన్ని ఉపయోగించుకోకుండా స్వంతంగా ప్రయాణం సాగించాలనుకొంటే భాజపాకి ఎదురీత, కష్టాలు తప్పకపోవచ్చును.

తెదేపాతో పొత్తుల విషయంలో భాజపా అధిష్టానం కూడా కొంచెం అయోమయంలో ఉంది కనుకనే మిగిలిన ఇదు రాష్ట్రాలతో బాటు ఆంధ్రాకి పార్టీ అధ్యక్షుడుని నియమించలేదని భావించవచ్చును. అటువంటప్పుడు రాష్ట్ర నేతలు తెదేపాని వ్యతిరేకించితే ఏమవుతుంది? ఆలోచించుకొంటే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close