రానాతో తేజ సినిమా..!

వ‌రుస ఫ్లాపుల‌తో ఒక‌ప్ప‌టి వైభ‌వాన్ని కోల్పోయిన ద‌ర్శ‌కుడు తేజ‌. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా… హిట్‌కి అతి ద‌గ్గ‌ర‌గా కూడా రాలేక‌పోతున్నాడు. పెద్ద హీరోలు తేజ‌తో సినిమాలు చేయ‌డానికి ముందుకు రావ‌డం లేదు. కొత్త వాళ్ల‌తో సినిమా తీస్తే వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఈ ద‌శ‌లో.. తేజ‌కు ఓ హీరో కావాలి. ఆహీరో ఇప్పుడు రానా అయ్యాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. ఔను.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. క‌థ ఇప్ప‌టికే సెట్ అయ్యింద‌ట‌. అది రానా కూడా ఓకే చేశాడ‌ట‌. అతి త్వ‌ర‌లో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2తో బిజీగా ఉన్నాడు. హిందీ మూవీ ఘాజీ కూడా చేతిలో ఉంది. ఈ రెండు సినిమాల మ‌ధ్య‌లో తేజ సినిమాని పూర్తి చేస్తాడా, లేదంటే.. అవి అయ్యాకే… తేజ‌తో జ‌ట్టు క‌డ‌తాడా అన్న‌ది తేలాల్సివుంది. ఈ సినిమాలోనే రాజ‌శేఖ‌ర్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. ఒక‌ప్పుడు వెంక‌టేష్‌తో ఓ సినిమా చేయాల‌ని తెగ ప్ర‌య‌త్నించాడు తేజ‌. బాబాయ్‌తో కాక‌పోయినా.. అబ్బాయ్‌తో సెట్ట‌య్యిందిప్పుడు.
మ‌రి ఈ సినిమాతో అయినా తేజ ట్రాక్‌లో కొస్తాడో లేదో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close