జగన్ నష్టపోతోంటే రఘువీరా కు కోపమొచ్చింది!

తెలుగుదేశం పార్టీ ఏపీ లో ప్రస్తుతం అమలు చేస్తున్న ఆకర్ష పథకానికి వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి మరి వలస వెళ్ళిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇవాళ టీడీపీ నాయకులు ప్రకటించిన ప్రకారం చూసినట్లయితే ఇంకా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా మరో 17 మంది కూడా ఉన్నారుట. ఇదంతా కార్యరూపం దాలిస్తే వైసీపీ మరింత దారుణంగా దెబ్బ తింటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏమిటి అంటే.. జగన్ కు జరుగుతున్నా నష్టానికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారధి రఘువీరా రెడ్డి ఇపుడు ఆవేదన చెందుతున్నారు. జగన్ పార్టీని వీడి వెళ్లిన వారిని అయన దారుణంగా తిట్టిపోస్తున్నారు.

రఘువీరా రెడ్డి అంటే అయన ప్రస్తుతం ఏపీసీసీ సారధి కావచ్చు గానీ, ఒకప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి పరమ భక్తులు అయిన మంత్రుల్లో ఒకరు అనే సంగతి అందరికీ తెలుసు. వైఎస్ మరణించినప్పుడు, జగన్ ను సీఎం చేయాలనే డిమాండ్ ను లేవనెత్తిన మొదటి బ్యాచ్ నాయకుల్లో రఘువీరా కూడా ఉన్నారు. తదనంతర పరిణామాల్లో , జగన్ సొంత పార్టీ పెట్టుకున్నప్పటికీ అయన మాత్రం కాంగ్రెస్ లొనే ఉండిపోయారు. అయితే ఇప్పుడు జగన్ పార్టీ బలహీన పడుతూ ఉండడం చూసి ఆయనకు కడుపు రగిలిపోయినట్లుగా కనిపిస్తోంది. అందుకే జగన్ పార్టీ ని వీడి వెళుతున్న వారు బిక్షగాళ్ల కంటే హీనులు అంటూ శాపనార్థాలు పెడుతున్నారు.

జగన్ ప్రజలకు క్షమాపణ చెబితే ప్రజలు మన్నించి అయన పార్టీ ని వీడి వెళుతున్న ఎమ్మెల్యే లకు బుద్ధి చెబుతారని రఘువీరా అంటున్నారు. బహుశా కాంగ్రెస్ ను వీడి బయటకు వచ్చినందుకు, జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలనేది రఘువీరా అభిమతం కావచ్చు. కానీ, అసలు పార్టీ ఎమ్మెల్యేల విషయంలోనే మోనార్క్ అనే ముద్రను, నిందలను మోస్తున్న జగన్, కాంగ్రెస్ ను వీడిన దానికి క్షమాపణ చెప్పడం సాధ్యమేనా అంటే అనుమానమే. రఘువీరా, ప్రస్తుతం జగన్ మీద చూపిస్తున్న సానుభూతి, అయన పార్టీ తో మైత్రి బంధం కలుపుకోవడానికి పునాది అవుతుందా అని కూడా పలువురు అనుమానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close