నాగాలతో శాంతి ఒప్పందం కుదుర్చుకొన్న మోడీ ప్రభుత్వం

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నలుగుతున్న అనేక తీవ్ర సమస్యలలో నాగాల సమస్య కూడా ఒకటి. అప్పటి నుండి నాగాలాండ్ లో ఉన్న 16 వివిధ తెగల మధ్య చిన్నపాటి యుద్దాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కారణంగా నాగాలాండ్ లో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పటికీ అక్కడ ఎప్పుడూ కూడా అశాంతి, రాజకీయ అనిశ్చిస్థితి నెలకొని ఉండేది. అదీకాక నాగా తిరుగుబాటుదారులు భారతసేనలతో గెరిల్లా యుద్ధం చేస్తూనే ఉన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, స్వర్గీయ పీవీ నరసింహ రావుల హయంలోనే నాగాల మధ్య అంతర్యుద్ధాలను నివారించి వారిని మిగిలిన భారతదేశంతో అనుసంధానం చేసేందుకు ముమ్ముర ప్రయత్నాలు జరిగాయి. చివరికి నరేంద్ర మోడీ హయాంలో నాగాలు భారత ప్రభుత్వంతో రాజీకి సిద్దపడి శాంతి ఒప్పందాలపై సోమవారం నాడు సంతకాలు చేసారు. ‘నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్’ (ముయివా వర్గం) సంస్థ నేత ఐజేక్ స్యూ దీనికి మార్గం సుగమం చేసారు.

 

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఇకపై అందరూ కలిసి నాగాలాండ్ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోడీ నాగాలాండ్ ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రతిపక్ష నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొన్నాక అడుగు ముందుకు వేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, హోం శాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు నాగాలాండ్ కి చెందిన వివిధ నాగా గ్రూపుల నేతలు పాల్గొన్నారు. ఈ శాంతి ఒప్పందం ప్రకారం ఇకపై నాగాలు అందరూ తమ ఆయుధాలు విడిచిపెట్టి తమ రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తారు. కేంద్రప్రభుత్వం కూడా నాగాలాండ్ అభివృద్ధిపై ప్రత్యేకహోదా దృష్టి పెడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close