జూన్ 2న తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటు?

2014 ఎన్నికల ప్రచార సమయంలో తెరాస అధికారంలోకి వస్తే తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను పునర్విభజించి, మొత్తం 25 జిల్లాలుగా ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెప్పారు. ఆ తరువాత ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి గానీ కొన్ని రాజకీయ, సాంకేతిక అవాంతరాలు రావడంతో, తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసి, ఆ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో అవసరమయిన పనులు పూర్తి చేయిస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అధికారులతో దాని గురించి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా కనీసం 14 జిల్లాలు, 40 మండలాలు ఏర్పాటు చేయడానికి వీలుగా పరిపాలన, పోలీస్ అధికారుల నియామకాలు, వారికి జిల్లా, మండల కేంద్రాలలో కార్యాలయాలు వగైరా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు. అయితే ఆగస్ట్ 15 నుంచి అన్ని హంగులతో కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని చెప్పారు. అంటే మరో రెండున్నర నెలలలో తెలంగాణా కొత్త రూపం సంతరించుకోబోతోందన్నమాట. ప్రతీ పది మండలాలకు ఒక ఆర్.డి.ఓ. ని నియమించడం ద్వారా పరిపాలన వికేంద్రీకరణ చేస్తామని కేసీఆర్ తెలిపారు.

తాజా సమాచారం ప్రకారం జగిత్యాల్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సిద్ధిపేట, మంచిర్యాల్, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. మిగిలిన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కూడా శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close