కార్యకర్తలు డోంట్ వర్రీ…మళ్ళీ ఎన్నికలకి వస్తా..బై!

ఒకప్పుడు రాజకీయాలలో ఉండేవారు ఫుల్-టైం పనిచేసేవారు. కానీ ఇప్పుడు చాలా మంది పార్ట్-టైం నేతలే. కొందరికి సినిమాలు..మరికొందరికి వ్యాపారాలు, పరిశ్రమలు, ఇంజనీరింగ్ కాలేజీలు, కాంట్రాక్టు పనులున్నాయి. కనుక వాళ్ళు ఎన్నికల సమయంలో ఫుల్ టైం, మిగిలిన ఐదేళ్ళు పార్ట్-టైం రాజకీయాలు (ప్రజాసేవ) చేస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా అటువంటి వారికి కొదవలేదు.

తమిళనాడులో డిఎండికె అధినేత విజయ్ కాంత్ కూడా ఆ కోవకి చెందిన వ్యక్తే. మొన్న వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో ఆయనతో సహా పార్టీలో అందరూ ఓడిపోయారు. చాలా మందికి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఎన్నికలలో డిఎండికె పార్టీకి 6 కంటే తక్కువ శాతం ఓట్లు పోల్ అవడంతో దాని గుర్తింపు కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితులలో ఏ పార్టీ నాయకుడైనా తన పార్టీ నేథలకి, కార్యకర్తలకి ధైర్యం చెప్తారు. కానీ విజయ్ కాంత్ మాత్రం “నేను మళ్ళీ సినిమా షూటింగులు మొదలుపెట్టేశాను. ఈ ఓటమితో ఎవరూ నిరుత్సాహం పడనవసరం లేదు. మన విజయం మరి కొంత కాలం వాయిదా పడింది. అంతే భవిష్యత్ లో మనమే అధికారంలోకి వస్తాము,” అని ట్వీట్ మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకొని షూటింగులకి వెళ్ళిపోయారు.

తను సినిమా షూటింగులలో బిజీ అయిపోయానని, అదేదో తమని ఉద్దరించడం అన్నట్లుగా ఆయన చెప్పడం చూసి పార్టీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకొంటున్నారు. ఎన్నికల సమయంలో తన పార్టీయే విజయం సాధిస్తుంది. తనే ముఖ్యమంత్రి అవుతానని విజయ్ కాంత్ పదేపదే చెప్పేవారు. తాను కింగ్ అవ్వాలి తప్ప కింగ్ మేకర్ కాదని కూడా చెప్పేవారు. ఏనాటికైనా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఆయనకి చాలా కాలంగానే ఉంది. అదే ఎన్నికల సమయంలో మళ్ళీ మరోమారు బయటపెట్టుకొన్నారు. ముఖ్యమంత్రి కావాలనే తన కోరిక తీర్చుకోవడానికే ఆయన ఎన్నికలలో పోటీ చేస్తున్నారు తప్ప పార్టీని, రాష్ట్రాన్ని, ప్రజలని ఉద్ధరించడానికి కాదని ఆయన మాటలే చెపుతున్నాయి. ఆ విషయాన్ని ఆయన ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పుకోవడం విశేషమే. అందుకే ప్రజలు ఆయనని మరో ఆలోచన లేకుండా తిరస్కరించారనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఊబిలో కూరుకుపోయిన వైసీపీ !

ఏపీ ఎన్నికలకు ఎజెండా సెట్ అయిపోయింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ అంశంపై మొదట్లో పెద్దగా...

ఏంటో ఈసీకి కూడా సీఐడీనే కనిపిస్తోందా ?

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం పొందుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close