ప్రత్యేకహోదాకోసం తిరుపతిలో యువకుడి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం ఇవాళ ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తిరుపతిలో ఇవాళ ప్రత్యేకహోదాపై కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభ ప్రారంభం కావటానికిముందు ఈ ఘటన జరిగింది. ప్రత్యేకహోదాపై నినాదాలు చేస్తున్న మునికోటి అనే కాంగ్రెస్ కార్యకర్త ఉన్నట్లుండి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సభకు హాజరైనవారు ఒక్కసారి జరిగిన ఈ ఘటనతో అవాక్కయ్యారు. పక్కనున్న కొందరు తమ చొక్కాలు విప్పి కోటిమీద కప్పి మంటలను ఆర్పటానికి ప్రయత్నించారు. అతనికి 70శాతం గాయాలయినట్లు తెలిసింది. అతనిని హుటాహుటిన రూయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన తర్వాత సభలో పాల్గొనటానికి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీలు చిరంజీవి, కేవీపీ, నాయకులు జేడీ శీలం, శైలజానాథ్ ఆత్మహత్యాయత్నంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలంగాణకోసం గతంలో ఇలా ఆత్మహత్యాయత్నాలు జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం ఇలా ఆత్మహత్యాయత్నం జరగటం ఇదే ప్రధమం. కోటి తిరుపతి వాసి అని, స్థానిక కాంగ్రెస్ నాయకుడు మబ్బు చెంగారెడ్డి అనుచరుడని తెలిసింది. అతను వేరేచోట కిరోసిన్ పోసుకుని సభాస్థలానికి వచ్చి నిప్పంటించుకున్నాడని తెలిసింది. మునికోటి కుటుంబాన్ని ఆదుకుంటామని, ఎవరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. మునికోటి కుటంబానికి రు.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మహత్యాయత్నం ఘటన అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు. జిల్లా ఎస్‌పీ, కలెక్టర్‌లతో మాట్లాడి ఆ యువకుడికి మెరుగైన వైద్యం అందేలాగా చేయాలని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు బొజ్జల, గాలిలకు సూచించారు. మొత్తంమీద ఈ ఘటన ప్రత్యేకహోదాపై ఏపీ ప్రజలలో ఉన్న అసంతృప్తిని వెల్లడిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close