వడ్డికాసులవాడికొచ్చే వడ్డీ ఎంతోతెలుసా – ఏడాదికి 80 కిలోల బంగారం మాత్రమే!

హైదరాబాద్: ఆయన అసలే ‘శ్రీ’నివాసుడు. ఆయన పేరులో, ఇంటిలో, వంటిలో లక్ష్మి కొలువుతీరి ఉంటుంది. దానికితోడు ఏడుకొండలపై ఆయనకు నిత్యకళ్యాణం-పచ్చతోరణంగా భోగాలు జరుగుతుంటాయి. సంవత్సరం సంవత్సరానికీ భక్తులు సమర్పించే కానుకల విలువ పెరగటమేగానీ, తరగటమనే మాటే ఉండదు. మరి ప్రపంచంలోకెల్లా ధనవంతుడైన ఆ దేవుడికి 5.5 టన్నుల బంగారముందంటే ఆశ్చర్యమేముంటుంది! శ్రీవారికి చెందిన బంగారం 4.5 టన్నులు ప్రస్తుతం స్టేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లలో ఉందని, త్వరలో మరో టన్నును స్టేట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయబోతున్నామని టీటీడీ అధికారులు నిన్న తెలిపారు. ఈ మొత్తం బంగారం విలువ రు.1,320 కోట్లు. ఈ బంగారంమీద మళ్ళీ వడ్డీకింద ఏటా 80 కిలోల బంగారాన్ని బ్యాంకులు జమచేస్తాయట. శ్రీవారి బంగారమంతా భక్తులు హుండీలద్వారా, వ్యక్తిగతంగా బిస్కట్‌లు, ఆభరణాలరూపంలో సమర్పించినదేనని అధికారులు తెలిపారు. 2010నుంచి బంగారాన్ని బ్యాంక్‌లలో డిపాజిట్ చేయటం ప్రారంభించామని వెల్లడించారు.

శ్రీవారి సంపదలో ఈ బంగారం ఒక చిన్న భాగంమాత్రమేనని ఆలయ వర్గాలు చెబుతాయి. ఆయన మొత్తం సంపదను ఇప్పటివరకు బహిరంగపరచలేదు. అయితే ప్రపంచంలోకెల్ల ధనిక దేవుడన్న పేరుకు ఆయన అవతారమే అయిన తిరువనంతపురం పద్మనాభునినుంచి ఇటీవల పోటీ వచ్చినట్లనిపించినా, తిరుమల ఆలయ వర్గాలుమాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నాయి. పద్మనాభుని మొత్తం సంపద లక్ష కోట్లని చెబుతున్నారని, శ్రీనివాసుని సంపద దానికి ఎన్నో రెట్లు ఉంటుందని తిరుమల వర్గాల వాదన. వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ ఉన్నా చివరికి ఆ దైవంమాత్రం ఒక్కరే కదా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close