డిల్లీలో ఏపి భవన్ మాదే: కెసిఆర్

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మరో సరికొత్త వివాదానికి తెర లేపారు. డిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్ ఒకప్పటి నిజాం నవాబు కి చెందిన భూముల్లోనే నిర్మించబడింది కనుక అది తెలంగాణాకే చెందుతుందని, కనుక దానిని తమకి అప్పగించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కి ఒక లేఖ వ్రాశారు. ఆ భవనాన్ని తమకి అప్పగించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరే చోట భవనం ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రా భవన్ న్ని తమకి అప్పగిస్తే దానిని కూల్చి వేసి తమ అవసరాలకు తగ్గట్లుగా కొత్త భవనం నిర్మించుకొంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కొత్త భవనం నిర్మించుకోవడానికి అవసరమైతే సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.

దాని గురించి రెండు రాష్ట్రాల మద్య వివాదం తలెత్తే అవకాశం ఉందని గ్రహించిన యూపియే ప్రభుత్వం, విభజన చట్టంలోనే అది రెండు రాష్ట్రాలకి విభజించి ఇచ్చింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా ప్రభుత్వం దాని గురించి ఒత్తిడి చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు. రెండేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు దాని కోసం కేంద్రానికి లేఖ వ్రాయడం విచిత్రంగానే ఉంది. ఆయన వాదనకి బలం చేకూర్చుకోవడానికి నిజాం నవాబు పేరు ప్రస్తావించినప్పటికీ, విభజన చట్టానికే విలువ ఉంటుందని బహుశః కెసిఆర్ కి తెలిసే ఉంటుంది. అది తెలిసి కూడా లేఖ వ్రాశారంటే మరో యుద్ధానికి సిద్దపడుతున్నట్లే భావించవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close