ఆయన్ని ఎవరూ పట్టించుకోరెందుకో?

పాపం! నాగం జనార్ధన్ రెడ్డి కలలన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయి ఎందుకో? ఆయనని తెదేపా నెత్తిన పెట్టుకొన్నప్పటికీ, తెరాస పార్టీలో చేరి తెలంగాణా ఉద్యమాలలో తను పాల్గొనాలనే కోరికతో తెదేపాలో నుండి బయటకు దూకేశారు. కానీ ఆయన ఊహించినట్లుగా కేసీఆర్ ఎర్ర తివాచీ పరిచి పార్టీలోకి ఆహ్వానించలేదు పైగా నాగంకి తెలంగాణా జేఎసిలో కూడా కాలుపెట్టకుండా తన కాలు అడ్డుపెట్టారు. తను ఎలాగు తెరాసలో చేరబోతున్నాననే నమ్మకంతో ఆయన చంద్రబాబు నాయుడిని తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టి పోయడంతో, మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేసుకొన్నారు. అటు తెరాసలోను ఎంట్రీ దొరక్క, ఇటు తెలంగాణా జేఎసిలోను దొరక్కపోవడంతో ఆయన తన కోపాన్ని అందుకు కారకుడయిన కేసీఆర్ మీద చూపించారు.

ఆ తరువాత తనే స్వయంగా ఓ స్వంత కుంపటి పెట్టుకొందామని ఊగారు గానీ అది చాలా ఖరీదయిన వ్యవహారమని వెనక్కి తగ్గి ఏదో చిన్న కట్టెల పొయ్యి వంటి ఫోరం పెట్టుకొని కొన్ని రోజులు కాలక్షేపం చేసారు. ఎన్నికల ముందు బీజేపీలోకి చేరడంతో మళ్ళీ తన దశ తిరుగుతుందని ఆశించారు. కానీ అక్కడా ఆయనని పట్టించుకొనేవాళ్ళే కరువయ్యారు. పోనీ డిల్లీ వెళ్దామా…అంటే చాలా దూరం పైగా ఉట్టికే ఎగరలేని వాడు అంటూ మోటు సామెతలు విని భరించాల్సి వస్తుంది.

ఇప్పుడు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో నాగం ఉన్నారు. తన వంటి బలమయిన నేతను ఏ పార్టీలు కూడా ఎందుకు గుర్తించడం లేదో ఆయనకే తెలియడం లేదు. అందుకే మళ్ళీ కట్టెలపొయ్యి వెలిగించే ప్రయత్నంలో ఉన్నారు. “బచావో తెలంగాణా” అని దానికి ఒక ముద్దుపేరు పెట్టుకొన్నారు కూడా. తను ఇంకా బీజేపీలో ఉండాలో బయటకు జంప్ అవ్వాలో ఇంకా డిసైడ్ చేసుకోకపోవడంతో అంతవరకు ఆ కట్టెల పొయ్యిని ఊదుతూ అగ్గి రాజేసే బాధ్యత తన సహచరుడు ఎన్నెం శ్రీనివాస రెడ్డికి అప్పజెప్పబోతున్నారు. పంద్రాగస్ట్ రోజున పొయ్యి వెలిగించడానికి ముహూర్తం పెట్టుకొన్నట్లు సమాచారం. ఆ హడావుడిలో పడే తన మెహబూబ్ నగర్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి నిర్వహించిన పార్టీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేకపోయారుట. కానీ అక్కడ సమావేశం అవుతున్నట్లు తనకి సమాచారం ఏమీ లేదని నాగం చెప్పారు. నాగంకి సమాచారం ఇవ్వకపోయినా, సమాచారం అంది వెళ్లకపోయినా రెంటి అర్ధం ఒకటే..ఆయనకీ పార్టీకి మధ్య దూరం పెరుగుతోందని! కారణాలు ఏవయితేనేమి బీజేపీలో నుండి నాగం బయటకు దూకేయడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. కానీ ఒకవేళ తను వెలిగిస్తున్న పొయ్యి సరిగ్గా రాజుకోకపోతే అప్పుడు ఆయన ఏమి చేస్తారో పాపం! నాగం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

ఆ ప్రజాగ్రహ ఓటులోనే బూడిదయ్యారు జగన్ గారూ !

జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల...

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close