ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏడాదిన్నర పాటు విచారణకు రాని ఏ 1 ప్రభాకర్ రావునే అనేక ప్రయత్నాల తర్వాత ఇండియాకు రప్పించి ప్రశ్నించారు. ఆయనే అత్యంత కీలకం. ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరివి?, ఆధారాలు ఎందుకు చెరిపేశారు?. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని ఎలా ఉపయోగించారు?…వంటి అంశాలన్నింటినీ తెలుసుకోవాలని పోలీసులు అనుకున్నారు. తొలి రోజు విచారణలో ఆయనతో ఏం చెప్పించారన్నది స్పష్టత లేదు. కానీ ప్రభుత్వ వర్గాలకు సన్నిహితంగా ఉండే మీడియా మాత్రం కొన్ని లీకులు ఇచ్చింది.
ఆ లీకుల ప్రకారం ప్రభాకరా రావే పోలీసులను ఎదురు ప్రశ్నించారు. తాను రాజీనామా చేసిన రోజు సాయంత్రం హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేశారని అంటున్నారని.. దానితో తనకేం సంబంధమని ఆయన చెప్పారంటున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయించలేదని.. ఎవరూ ఆదేశించలేదని.. ఆయన చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఓ రివ్యూ కమిటీ ఉంటుందని..దానిలో తాను సభ్యుడిని కాదని ప్రభాకర్ రావు స్పష్టం చేశారని అంటున్నారు. విచారణ మొత్తంలో సిట్ కే ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నలు వేశారు. ఆయనకు పోలీసు అధికారిగా సుదీర్ఘ అనుభవం ఉంది.
అయితే ఇంత చేసి ఆయనను అంత సింపుల్ గా వదిలేయలేరుగా.. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక్క క్లూ అయినా బయటకు లాగాల్సి ఉంటుంది. అది ఈ రోజు లాగి ఉంటారా.. తర్వాత రోజు విచారణల్లో బయటకు వస్తాయా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆయనను అరెస్టు చేయకుండా రక్షణ ఉంది. సుప్రీంకోర్టు తర్వాత ఆ రక్షణ తొలగిస్తే అరెస్టు చేస్తారు. ఒక వేళ ఇతర కేసుల్లో అరెస్టు చేయాలనకుంటే వెంటనే చేస్తారు. ఆయనపై ఇతర కేసులు కూడా ఉన్నాయి.