అమరావతిపై అత్యంత ఘోరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. విశ్లేషకుడి మాటలతో చర్చా కార్యక్రమం నిర్వాహకుడికి సంబంధం ఉండదని.. అయితే భవిష్యత్ లో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, చేయించడం లాంటివి చేయకూడదని షరతు పెట్టింది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు .. ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం చెప్పింది.
తన వయసును ప్రధానంగా 70 ఏళ్లు అని ఆయన తరపు లాయర్ వాదించారు. కింది కోర్టు బెయిల్ నిరాకరిస్తే.. ఎవరైనా హైకోర్టుకు వెళ్తారు. అక్కడ నిరాశ ఎదురైతే సుప్రీంకోర్టుకు వెళ్తారు. కానీ.. కొమ్మినేని లాయర్లు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ పిటిషన్ దాఖలు చేయగానే విచారణకు వచ్చింది. వెంటనే బెయిల్ కూడా వచ్చింది. కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల ఆదేశాలు తెచ్చుకున్నారు.
ఇప్పటికే ఈ కేసులో ఏ వన్ గా ఉన్న కృష్ణంరాజు అనే విశ్లేషకుడిని కూడా అరెస్టు చేస్తారు. ఆయన కోసం కూడా సుప్రీంకోర్టుకు వెళ్తారో లేదో స్పష్టత రావాల్సి ఉంది. ఆ విశ్లేషకుడితో తమకు సంబంధం లేదని…ఆయన చెప్పింది కూడా వ్యక్తిగత అభిప్రాయాలేనని జగన్ రెడ్డి పత్రిక , టీవీ చానల్ అంటోంది. కానీ ఆయనతో అనిపించింది ఆ పత్రిక , చానల్ అని కేసులో ఏ త్రీగా పోలీసులు చేర్చారు. ఇంకా చర్యలు ప్రారంభించలేదు.