అనుష్క మళ్లీ జోరు పెంచింది. కెరీర్ పీక్ లో వున్నప్పడే సినిమాలకి విరామం ఇచ్చింది స్వీటీ. ‘సైజ్ జీరో’ సినిమా తర్వాత శరీరంలో వచ్చిన మార్పుల వల్ల అనూహ్యంగా బరువు పెరిగింది. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ మళ్లీ మామూలు స్థితికి రాలేకపోయింది. దీంతో చాలా విరామం తీసుకున్న అనుష్క ‘నిశ్శబ్దం’ చిత్రంతో తిరిగి వచ్చింది. అందులో కూడా ఆమె బొద్దుగా కనిపించింది. ఆ తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంలో నటించింది. ఆ సినిమా డీసెంట్ విజయం సాధించింది. ఇప్పుడు ‘ఘాటి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఇంతవరకు ప్రతి సినిమా మధ్య సుమారు రెండేళ్ల విరామం తీసుకుంటూ వచ్చిన ఆమె, ఇకపై అలాంటి తీరుకు గుడ్బై చెబుతోంది. వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలో కొత్త కథలు వినడం ప్రారంభించింది. ‘జైలర్ 2’లో అనుష్క కీలక పాత్రలో కనిపించనుందని టాక్. అలాగే లోకేష్ కనగరాజ్ యూనివర్స్లో వచ్చే ఓ సినిమాలో కూడా ఆమె ఉంటుందని సమాచారం. మరోవైపు ‘భాగమతి 2’ చాలా కాలంగా వార్తల్లో వుంది. ఈ ఏడాదిలో ఆ సీక్వెల్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది. సోలోగా 50 కోట్లు కలెక్ట్ చేయగల హీరోయిన్ అనుష్క. ఇప్పుడు ఆమె సినిమాల జోరు పెంచడం ఇండస్ట్రీకి ప్లస్సు.