మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జరీ చేసింది. ఫార్ములా ఈ కేసులో సోమవారం విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులను జారీ చేసింది. ఉదయం 10గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది.
గతంలో కేటీఆర్ కు రెండోసారి నోటీసులను జారీ చేసింది. అయితే, తాను విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉండటంతో.. తిరిగివచ్చాక విచారణకు హాజరు అవుతానని ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై ఇచ్చారు. అందుకు ఏసీబీ కూడా అంగీకరించింది. ఈ క్రమంలోనే ఆయన విదేశీ పర్యటనను ముగించుకొని రావడంతో తాజాగా ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఫార్ములా ఈ కేసులో ఏగా ఉన్న కేటీఆర్ , ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ , ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విడివిడిగా విచారించింది. మరోసారి విచారణకు హజరు కావాల్సి ఉంటుందని కేటీఆర్ కు అప్పట్లో చెప్పారు. దాంతో ముగ్గురిని కలిపి విచారిస్తారని అనుకున్నారు. కానీ , అలాంటిదేం లేకుండా పోయింది.
మూడు నెలల నుంచి ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఫార్ములా ఈ కేసు మూలకు పడినట్లేనని వార్తలు వినిపిస్తున్నా నేపథ్యంలో కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు.